దేశంలో నిర్లక్ష ధోరణి, బడా బాబులకు ప్రభుత్వాలు ఎలా కొమ్ముకాస్తాయో అన్నట్లు మరోసారి మాల్యా వ్యవహారం నిరూపించింది. తమకు ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలతో మాల్యా మీద బ్యాంకులకు కోర్టుకెక్కాయి. కాగా మాల్యా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని కన్సార్టియం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వారం క్రితమే ఆయన దేశం వదిలి విదేశీ విమానం ఎక్కేశాడని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ నెల 2న మాల్యా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. మాల్యా తీసుకున్న రుణాల కంటే విదేశాల్లో ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఏజీ కోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బెంచ్ మాల్యాకు నోటీసులు జారీచేసింది. వచ్చే రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోర్టు ఆదేశించింది. ఈ నోటీసులను మాల్యాకు ఈ-మెయిల్ ద్వారా పంపినట్లు తెలుస్తున్నది. మాల్యా బ్రిటన్కు వెళ్లే అవకాశం ఉండటంతో అక్కడి భారత హైకమిషనర్కు, సిబ్బందికి నోటీసులను మెయిల్ చేశారు.
అయితే గతంలో కూడా బడా బాబులకు అప్పటి ప్రభుత్వాలు కొమ్మెుకాశాయని... ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశం వదిలి ప్రశాంతంగా వెల్లిపోయిన మాల్యాకు ఇప్పుుడు మాత్రం వెనక్కి పంపిస్తామని ప్రభుత్వం నివేదించడం తర్వాత ఆనక చెయ్యలేకపోవడం జరుగుతాయని కొంత మంది విమర్శిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న వారినుంచి ప్రతి పైసా వసూలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి విజయ్ మాల్యా లాంటి బడా బాబుల నుండి కూడా వసూలు చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more