Court to be moved over Yamuna Expressway deaths

Accident victim s family claims smriti didn t help hrd ministry denies charge

Court to move over Yamuna Expressway deaths, smriti irani, smriti irani accident, yamuna expressway accident, Yamuna Expressway deaths, victim's family claims Smriti didn't help, HRD Ministry denies charge,

After the family of a man who died in an accident on Yamuna expressway claimed that they asked HRD Minister Smriti Irani for help and she refused

కేంద్రమంత్రి అమానవీయంగా వ్యవహరించారు.. మృతుడి కుమార్తె అరోపణ

Posted: 03/07/2016 06:34 PM IST
Accident victim s family claims smriti didn t help hrd ministry denies charge

బీజేపి నేతల, మంత్రులు తృటిలో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నా.. వారి చుట్టూ వివాదాలు మాత్రం రాజుకుంటున్నాయి. ఇటీవల బీజేపి ఎంపీ హేమామాలిని ప్రమాదం బారిన పడిన తరువాత.. అమె కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మొదట అమె కూతుళ్లు ఒకలా, ఆ తరువాత అమె కోలుకున్న తరువాత స్వయంగా మీడియాతో మాట్లాడిన హేమామాలిని మరోలా స్పందించడంపై నెట్ జనులు తీవ్రంగా స్పందించారు.

సరిగ్గా అదే మాదిరిగా తాజాగా యమునా ఎక్స్ ప్రెస్వేపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన వైద్యుడొకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్మృతి ఇరానీ కాన్వాయ్ కారు రెండు పర్యాయాలు తమ కారును ఢీ కోనడంతోనే వైద్యుడు మరణించాడని, లేని పక్షంలో ఆయన బతికేవారని మృతుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు.

మరోవైపు ప్రమాదం జరిగిన తరువాత తన కాన్వాయ్ నుంచి దిగిన మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఘటనను చూసి తన వాహనాన్ని ఎక్కి వెళ్లిపోయిందని, అమెను తన తండ్రిని బతికించమని, ఆప్పత్రికి తరలించేందుకు సహాయపడమని చేతులు జోడించి అర్థించినా.. పెడచెవిన పెట్టి అమానవీయంగా వ్యవహరించారని మృతుడి కుమార్తె ఆరోపించారు. అమె మీడియాతో మాట్లాడుతూ.. 'స్మృతి ఇరానీ కాన్వాయ్ లోని వాహనం మా కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి ఇరానీ బయటకు వచ్చారు. సహాయం చేయమని చేతులు జోడించి వేడుకున్నాను. కానీ ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయార'ని మృతుడి కుమార్తె అవేదన వ్యక్తం చేసింది.

తన సోదరి ఎంతగా బతిమాలినా మంత్రి మనసు కరగలేదని మృతుడి కుమారుడు వాపోయాడు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రమాద బాధితులకు వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, చికిత్స అందించాలని స్థానిక అధికారులను స్మృతి ఇరానీ ఆదేశించారని వెల్లడించింది. ప్రమాదానికి ఇరానీ కాన్వాయ్ కారణం కాదని పేర్కొంది. ఇదిలావుండగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కూడా మంత్రి కాన్వాయ్ కు, ప్రమాదానికి కారణం లేదని తేల్చిచెప్పారు. అయితే ఈ ప్రమాదంపై న్యాయస్థానం సుమోటోగా కేనును విచారించనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles