తొలిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్లోనూ భారత్ ఆధిపత్యమే సాగింది. ఆసియా కప్లో భారత్ ఆరోసారి చాంపియన్గా నిలిచింది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఎనిమిది వికెట్లతో నెగ్గిన ధోనీసేన ఆతిథ్య బంగ్లాదేశ్ ఆశలపై నీళ్లు చల్లుతూ మరోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. వర్షం అంతరాయం కారణంగా 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో బంగ్లా నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ధోనీసేన రెండు వికెట్లు కోల్పోయి ఏడు బంతులుండగానే విజయాన్నందుకుంది. సిరీస్లో ఫామ్లేమితో సతమతమైన ధవన్ ఎట్టకేలకు ఫైనల్లో జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లను చితకబాదుతూ ధవన్(44 బంతుల్లో 60) అర్ధసెంచరీతో జట్టు చిరస్మరణీయ గెలుపులో పాలుపంచుకున్నాడు.
ధావన్కు తోడు అద్భుతఫామ్తో అలరిస్తున్న కోహ్లీ(41నాటౌట్), కెప్టెన్ ధోనీ(20నాటౌట్) జతకలవడంతో టీమ్ఇండియా అలవోక విజయాన్ని నమోదు చేసుకుంది. ధవన్, కోహ్లీ, ధోనీ ధాటికి బంగ్లా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్తో ఫామ్లోకొచ్చిన ధవన్ తన ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఓ భారీ సిక్స్తో అలరించాడు. మ్యాచ్ ఫినిషర్గా ముద్రపడ్డ ధోనీ తనదైన శైలిలో ధనాధన్ ఇన్నింగ్స్తో ముగింపు పలికాడు. 13వ ఓవర్లో బ్యాటింగ్కు దిగిన ధోనీ 6 బంతుల్లో ఓ ఫోర్, రెండు ట్రేడ్మార్క్ సిక్స్లతో విజృంభించాడు. ఇక బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ఆల్అమిన్ హుస్సేన్లకు చెరో వికెట్ దక్కింది. అర్ధసెంచరీతో జట్టు గెలుపులో కీలకమైన ధవన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా,షబ్బీర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more