తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి ఆపోపాలుపడుతున్న చంద్రబాబు నాయుడు ఏపిలో మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారు. వరుసగా వైసీపీ నాయకులను టార్గెట్ గా చేస్తూ పావులు కదుపుతున్నారు. రెండు రోజుల క్రితం రోజా టిడిపిలో ఏముందని తమపార్టీ నాయకులు చేరుతారు అని వ్యాఖ్యానించినా కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం తమ పని తాను సైలెంట్ గా చేస్తున్నారు. వచ్చేనెలలో జరిగే బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించాలని యోచిస్తున్నారు చంద్రబాబు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు పార్టీ ఇన్ చార్జ్ రామసుబ్బారెడ్డిని పిలిపించుకుని చంద్రబాబు సర్ది చెప్పారు. పార్టీ బలోపేతం దృష్ట్యా కొంతమందిని టీడీపీలో చేర్చుకోవాల్సి వస్తోందని.. దానికి అడ్డుచెప్పకుండా సహకరించాలని బాబు కోరారు. త్వరలో వైసిపి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేరికకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఇలాగే ఎవరైతే ఎమ్మెల్యేల రాకను వ్యతిరేకిస్తున్నారో వారందరికీ మరోసారి నచ్చచెప్పాలని చూస్తున్నారు చంద్రబాబు.
ఆపరేషన్ ఆకర్ష్పై వారం రోజులుగా చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నాలుగు రోజుల క్రితం లోకేష్, యనమలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోసారి చంద్రబాబు నాయుడు ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, లోకేష్, మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా ఆసక్తి ఉన్న నేతలు ఎవరనేదానిపై ఆరాతీశారు చంద్రబాబు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, అరకు వైసిపి ఎమ్మెల్యే టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టిడిపి నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున కర్నూల్ జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే వారిని పార్టీలో చేర్చుకునే సమయంలో ఎంతోకాలంగా పార్టీకి సేవలందిస్తున్నవారిని సముదాయించాకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు. పార్టీని బలోపేతం చేసే దిశగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, దానికి సహకరించాలని మంత్రులకు, సీనియర్లకు సర్ధిచెప్పారు. ఎవరొచ్చినా కలిసి పనిచేయాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more