Narendra Modi | Army Chief | Visits | Siachen

Modi and army chief visits siachen

Modi and Army Chief Visits Siachen, Narendra Modi and Army Chief Visits Siachen, Narendra Modi Visits Siachen, Narendra Modi Visits Hanumantappa, Narendra Modi latest tweets, Narendra Modi

Modi and Army Chief Visits Siachen: Prime Minister Narendra Modi and army chief General Dalbir Singh visited the Army.

మృత్యుంజయ జవాన్.. ప్రధాని, ఆర్మీ చీఫ్ పరామర్శ

Posted: 02/09/2016 04:16 PM IST
Modi and army chief visits siachen

దాదాపు ఆరు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన భారత జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్పను పరామర్శించేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారు. ఈ నెల మూడో తేదీన సియాచిన్ ప్రాంతంలో భీకరంగా వచ్చిన మంచు తుఫాను కారణంగా విరిగిపడిన కొండచరియల్లో చిక్కుకుపోయాడు లాన్స్ నాయక్. భారీ మంచుతుపాను వచ్చి టన్నుల కొద్దీ బరువున్న మంచుగడ్డలు పడటంతో వాటి కింద పది మంది భారత సైనికులు చిక్కుకుపోయారు.

మంచు తుఫాను అనంతరం సైనికులను గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే వున్నాయి. అలా సైనికుల కోసం ప్రయత్నిస్తున్న ఆర్మీకి హనుమంతప్ప సజీవంగా కనిపించాడు. దీంతో ఆయనను వెంటనే హుటాహుటిన సైనిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హనుమంతప్ప ఐసీయూలో వున్నారు.

హనుమంతప్పను పరామర్శించడానికి భారత ప్రధాని నరేంద్రమోడీ మరియు భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ హాస్పిటల్ కు చేరుకున్నారు. హాస్పిటల్ కు చేరుకున్న మోడీ, ఆర్మీ చీఫ్ లు హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు చేయాలని మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు.

హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగానే వున్నప్పటికీ... ఆరోగ్యం నిలకడగా వుందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మంచుకొండల క్రింద చిక్కుకుపోయిన పదిమందిలో హనుమంతప్ప తప్ప మిగతా వారంతా కూడా మరణించినట్లుగా నిర్దారణ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Army Chief  Visits  Siachen  Hanumantappa  

Other Articles