దాదాపు ఆరు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన భారత జవాన్ లాన్స్ నాయక్ హనుమంతప్పను పరామర్శించేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారు. ఈ నెల మూడో తేదీన సియాచిన్ ప్రాంతంలో భీకరంగా వచ్చిన మంచు తుఫాను కారణంగా విరిగిపడిన కొండచరియల్లో చిక్కుకుపోయాడు లాన్స్ నాయక్. భారీ మంచుతుపాను వచ్చి టన్నుల కొద్దీ బరువున్న మంచుగడ్డలు పడటంతో వాటి కింద పది మంది భారత సైనికులు చిక్కుకుపోయారు.
మంచు తుఫాను అనంతరం సైనికులను గుర్తించేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ముమ్మరంగా ప్రయత్నిస్తూనే వున్నాయి. అలా సైనికుల కోసం ప్రయత్నిస్తున్న ఆర్మీకి హనుమంతప్ప సజీవంగా కనిపించాడు. దీంతో ఆయనను వెంటనే హుటాహుటిన సైనిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హనుమంతప్ప ఐసీయూలో వున్నారు.
హనుమంతప్పను పరామర్శించడానికి భారత ప్రధాని నరేంద్రమోడీ మరియు భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ హాస్పిటల్ కు చేరుకున్నారు. హాస్పిటల్ కు చేరుకున్న మోడీ, ఆర్మీ చీఫ్ లు హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు చేయాలని మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు.
హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగానే వున్నప్పటికీ... ఆరోగ్యం నిలకడగా వుందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మంచుకొండల క్రింద చిక్కుకుపోయిన పదిమందిలో హనుమంతప్ప తప్ప మిగతా వారంతా కూడా మరణించినట్లుగా నిర్దారణ అయ్యింది.
Going to see Lance Naik Hanumanthappa, with prayers from the entire nation.
— Narendra Modi (@narendramodi) February 9, 2016
No words are enough to describe the endurance & indomitable spirit of Lance Naik Hanumanthappa. He is an outstanding soldier: PM
— PMO India (@PMOIndia) February 9, 2016
Team of doctors is attending to Lance Naik Hanumanthappa. We are all hoping & praying for the best: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 9, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more