తెలంగాణ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింతగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల తరహాలోనే తెలంగాణలో కృష్ణా పుష్కరాలను నిర్వహించి, తెలంగాణ ఖ్యాతిని, గౌరవాన్ని పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది ఆగస్టులో మంచివర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంపై సచివాలయంలో కృష్ణా పుష్కరాలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 50 వరకు స్నానఘట్టాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలు జరిగిన సమయం, ప్రదేశాలతో పోలిస్తే కృష్ణా పుష్కరాలు చాలా భిన్నమైనవని, చాలా జాగ్రత్తలు అవసరమని సూచించారు.
కృష్ణానదితీరంలోని జోగులాంబ దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాల్లో ఘనమైనదని, ఈ దేవస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, దేవస్థానం వరకు చక్కని రహదారులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కృష్ణానదీతీరం వరకు రాకపోకల సౌకర్యాలు సరిగ్గా లేనందున, తీరంవరకు వెళ్లడానికి, అక్కడినుంచి రావడానికి వేర్వేరు దారులు ఏర్పాటుచేయాలని అన్నారు.
అలాగే వాహనాలకు ఇబ్బందులు ఏర్పడకుండా, గట్టినేలలో పార్కింగ్స్థలాలు, హోర్డింగ్స్పేస్లు ఏర్పాటుచేయాలని తెలిపారు. కృష్ణానదిలో మొసళ్లు ఉంటాయని, ఆ దిశలో జాగ్రత్తలు అవసరమని చెప్పారు. జోగులాంబ దేవస్థానంతోపాటు పుష్కరఘాట్లకు వెళ్లేమార్గంలో ఉండే అన్నీ దేవాలయాలను గుర్తించి ఆధునీకరించాలని సీఎం మార్గనిర్ధేశం చేశారు. పుష్కరస్నానం చేసిన తర్వాత క్షేత్రదర్శనం సంప్రదాయమని, ఆలయాల వద్ద సదుపాయాలను పెంపొందించాలని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more