ఏఫిలో నిప్పురాజుకుంది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. కాగా ఈ ఘటన మీద ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నేరగాడు తన స్వార్థం కోసమే తునిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు. 25 వాహనాలు, రెండు పోలీస్ స్టేషన్లను తగులబెట్టారన్నారు. ఇదంతా చేసింది పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ పార్టీలేనని మండిపడ్డారు ముఖ్యమంత్రి. విధ్వంసం సృష్టిస్తే నష్టపోయేది ఎవరో ఆలోచించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, దీనిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సి ఉందన్నారాయన.
అసెంబ్లీలోనూ, బయట రౌడీయిజం చేయాలని కొందరు చూస్తున్నారని, ఇలాంటి పనుల చేయడం వల్ల ఎవరికి నష్టమో కాపులు ఆలోచించుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. అందరూ సంయమనంగా ఉండాలని సూచించారు. ఒక నేరగాడు పదే పదే రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తండ్రి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు? ఈ విషయాలన్నీ కాపులు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వారి కారణంగా సంయమనం కోల్పోవద్దు... అది సమాజానికి మంచిది కూడా కాదు అని కాపులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more