గ్రేటర్ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. అయితే అధికార పార్టీ టిఆర్ఎస్ అన్ని పార్టీల కన్నా ముందు ప్రచారంలో ఉంది. కాగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రచారంలో వెనుకబడింది. ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కారణంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. అయితే తాజాగా ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారానికి సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడంతో పాటుగా.. కీలకమైన ఆంధ్రా ఓట్లను తమ ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు సిద్దమవుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అధికార పార్టీ ప్రచారాన్ని తిప్పి కొడుతూ.. గ్రేటర్ లో విజయానికి బాటలు వేసేందుకు సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొనే ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టింది. గ్రేటర్ ఎన్నికలతో అధికార పార్టీపై పైచేయి సాధించాలని పట్టుదలగా ఉన్న టీడీపీ-బీజేపీ కూటమి.. సమర శంఖారావాన్ని పూరించింది. నిజాం కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. భారీ బహిరంగ సభతో.. హైదరాబాద్ లో బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. నగరంపైన పట్టు తమదేనన్న సంకేతాలను పంపించడమే ధ్యేయంగా .. సభను విజయవంతం చేయడానికి టీడీపీ, బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కనీసం యాభై వేల నుంచి డెబ్పై వేల మందిని తరలించాలన్న పట్టుదలతో నేతలున్నారు. మరి చూడాలి ఈ సభ ఎంత వరకు సక్సెస్ అవుతుంది... చంద్రబాబు నాయుడు టిడిపి-బిజెపి కూటమికి ఎంత లాభం చేకూరుస్తారో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more