చదువుకుంటామని ఆశలతో అమెరికా వెళ్లిన మన తెలుగు విద్యార్థులకు అక్కడ చుక్కలు చూపించి తిరిగి పంపుతున్నారు అక్కడ అధికారులు. వారం క్రితం కొంత మంది విద్యార్థులను గుర్తింపులేని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందడానికి వచ్చారంటూ తిరిగి పంపించేశారు. తాజాగా మరో 22 మంది తెలుగు విద్యార్థులను తిరిగి పంపించింది అమెరికా. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు రెండు రోజుల క్రితం వెళ్లారు. న్యూయార్క్ ఎయిర్పోర్టులోకి వెళ్లాగానే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు రకరకాల ప్రశ్నలు వేశారు. చివరకు మీరు చదివే వర్సిటీలు బ్లాక్ లిస్టులో ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన అన్ని పత్రాలూ తీసుకొని వచ్చాం కాదా? అయినా మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అని కొందరు విద్యార్థులు ప్రశ్నించారు. ఆగ్రహించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థుల చేతులకు బేడీలు వేసి.. వివిధ ప్రాంతాలకు తిప్పుతూ 24 గంటలపాటు చిత్రహింసలకు గురిచేశారు.
న్యూయార్క్ నుంచి వచ్చేసిన విద్యార్థులకు శంషాబాద్ ఎయిర్పోర్టులోనూ కష్టాలు తప్పలేదు. విద్యార్థులను ఎయిర్ ఇండియా యాజమాన్యం.. టికెట్ ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని పట్టుబట్టింది. తాము అంత మొత్తం చెల్లించలేమని చెప్పడంతో ఎనిమిది గంటల పాటు వారిని కదలనీయలేదు. ఓ దశలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయంలో ఆందోళన చేసినా అధికారులు స్పందించలేదు. ముఫ్తీ మహ్మద్ అంత్యక్రియలకు హాజరై కశ్మీర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి విద్యార్థులు తమ పరిస్థితిని వివరించారు. ఈ విషయమై ఇమ్మిగ్రేషన్ అధికారులపై అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సూచనతో అధికారులు విద్యార్థులను వదిలిపెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more