ఏపీలో రాజకీయాలు రసకందాయంగా మారాయి. జగన్ను వెన్నంటి ఉన్న కొణతాల రామకృష్ణ వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వైసీపీ నేతలు కొణతాల, గండి బాబ్జీ టీడీపీలో చేరేందుకు సర్వంసిద్ధం చేసుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. కళా వెంకట్రావ్, మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఏసీ సీఎం చంద్రబాబును కొణతాల కలిశారు. అయితే కొణతాల, బాబ్జీ రాకను మంత్రి గంటా శ్రీనివాస్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరి చేరిక టీడీపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. కాగా కొణతాల రామకృష్ణ, ఆయన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఈ ఉదయం సీఎం చంద్రబాబును కలిసారు. మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరుండి మరీ వారిని సీఎం వద్దకు తీసుకెళ్లారు.
కొణతాల రామకృష్ణ చేరికతో టీడీపీ బలం మరింత పెరుగుతుందని ఏపీ అటవీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కొణతాల కేడర్ ఉన్న నాయకుడు అన్న అయ్యన్నపాత్రుడు.. సంక్రాంతి తర్వాత తన అనుచరులతో కలిసి ఆయన టీడీపీలో చేరతారని చెప్పారు. నమ్మకస్తులు ఎవరైనా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మంత్రి అయ్యన్న స్పష్టం చేశారు. కాగా కొణతాల చేరికకు పార్టీ అధినేత చంద్రబాబే ఆమోదం తెలిపిన తర్వాత, పార్టీలోని ఎవరూ వ్యతిరేకించేది ఉండదని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని మంత్రి వెల్లడించారు. కొణతాల, గండి బాబ్జీ చేరికతో స్థానికంగా విభేదాలు వస్తాయని అనుకోవడం లేదన్నారాయన. వ్యక్తిగతంగా తనకు, ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విభేదాలున్నా కలిసి పని చేస్తున్నామని మంత్రి అయ్యన్న వ్యాఖ్యానించారు. కాగా దాడి వీరభద్రరావు తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా లేరని అయ్యన్నపాత్రుడు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more