తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయత ఛండీయాగానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రపతి దగ్గరి నుండి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఈ ఆయత ఛండీయాగానికి ఆహ్వాన పత్రిక అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందుకు, తెలంగాణలో పిరి సంపదలు, తెలంగాణ వాసులకు ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని కేసీఆర్ ఈ ఛండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్వహిస్తున్న యాగానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: చంద్రబాబు, కేసీఆర్ కలయిక మీద ఇన్ని పుకార్లా..?
కేసీఆర్ దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఛండీ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1500 మంది పండితులు మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా ఆయత ఛండీయాగం జరగనుంది. డిసెంబర్ 23 నుండి ఐదు రోజుల పాటు సాగే ఈ యాగానికి ఎలాంటి లోటు లేకుండా కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారు. 150 మంది వంటగాళ్లను ఈ యాగానికి రప్పిస్తున్నారు. అమ్మవారి పూజను అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాకుండా.. వచ్చిన అతిథులకు కూడా అదిరిపోయే ఆతిధ్యం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. కాగా ఈ యాగానికి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి చంద్రబాబును సతీసమేతంగా ఆహ్వానించారు కేసీఆర్. మొత్తం 50 వేల మంది ప్రజలు, అతిథులు ఈ యాగానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more