ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో విశ్వశాంతి కాంక్షిస్తూ, తెలంగాణలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు తొలగిపోవాలని ఆశిస్తూ.. చేపడుతున్న ఆ మహత్ కార్యమే ఆయుత చండీ యాగం.. ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు సిద్ధం అయిపోయాయి. వీటిని వీవీఐపీలకు అందివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం ప్రముఖులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు సీఎం సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు నాయుడుకు భార్యాసమేతంగా వెళ్లి కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా.. విజయవాడలో దుర్గ గుడిలో మెక్కు చెల్లించనున్నారు.
ఆయుత చండీయాగం ధార్మిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఫామ్ హాజ్ పరిసర ప్రాంతాలు వేదిక కాబోతున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదురోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. దేవుడిపై అపార విశ్వాసం కలిగిన కేసీఆర్... ఇప్పటికే ఎన్నో యజ్ఞయాగాదులు చేసినప్పటికీ... ఇప్పటివరకెప్పుడూ చేయనిది ఆయుత చండీయాగం. ఈ యాగం చేయాలంటే దృడ సంకల్పమే కాదు.. పరమ పవిత్రంగా , నిష్టా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఏ మాత్రం లోపం జరగకుండా అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అందుకే ఈ యాగాన్ని సంకల్పించేందుకు ఎవరూ అంతగా ముందుకు రారు. కానీ విశ్వశాంతిని కాంక్షించిన సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో .. ఈ యాగానికి పూనుకున్నారు.
సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా చేపట్టిన ఈ యాగానికి... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. దీంతో యాగశాలలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణబ్తో పాటు ఆయన సంబంధీకులు కూర్చునేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫోన్లో ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. వీరికే కాకుండా మరికొందరు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానపత్రాలు వెళ్లాయి. .
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more