నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే ప్రదేశం. అక్కడ ఓ బ్యాగ్ పడి ఉంది. చాలా సమయం నుండి అది అలాగే ఉండటాన్ని గమనించిన స్థానికులు ఉత్సుకతను ఆపుకోలేక అందులో ఏముందో అని తెరిచి చూశారు. అంతే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. నడిరోడ్డుపై పడి ఉన్న ఓ బ్యాగును తెరచి చూడగానే దాని నిండా డబ్బు కట్టలు వున్నాయి.
సాదాసీదాగా కనిపిస్తున్న ఆ బ్యాగులో రూ.10 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని చర్చించుకుంటుండగా, బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి సదరు బ్యాగును పడేసుకుని వెళ్లాడని తేలింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. నగరంలోని మొఘల్ రాజపురం సమీపంలోని భాష్యం పబ్లిక్ స్కూలు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కట్టలను ఆసక్తిగా పరిశీలించిన స్థానికులు ఆ తర్వాత వాటిని పోలీసులకు అప్పగించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more