కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. స్వచ్ఛ భారత, మేక్ ఇన్ ఇండియా బాగున్నాయంటూ కొంతమంది విద్యార్థులు సమాధానమివ్వడంతో ఆయన కంగు తిన్నారు. రాహుల్ గాంధీ బెంగళూరు మౌంట్కార్మెల్ కళాశాల విద్యా ర్థులతో డిబేట్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారు.స్వచ్చభారత అభియానతో దేశంలో మంచి జరిగిందా అని విద్యార్థులను ప్రశ్నించగా అవును.. అవును అంటూ వారు సమాధానమిచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో ఏమైనా పురోగతి సాధ్యమయిందా? అని ప్రశ్నించగా అవునని జవాబివ్వడంతో రాహుల్ ఖంగుతిన్నారు. అనంతరంపలువురు విద్యార్థులు ఇదే అంశాలపై సూటిగా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో రెండుగంటల పాటు సాగాల్సిన చర్చాగోష్టి అరగంటకు ముందుగానే ముగిసింది. అనంతరం డిబేట్ సంతృప్తినిచ్చిందని రాహుల్ అభిప్రాయపడడం గమనార్హం.
దేశం మొత్తం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో నడవాలని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని, ఈ దేశాన్ని ఆయన మాత్రమే మార్చగలననుకొంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రంలో నిర్ణయాధికారం ఉన్న కొందరు వ్యక్తులు ఉన్నారని, కానీ వారందరినీ బేఖాతరు చేస్తూ ప్రతి నిర్ణయాన్ని ఒకే వ్యక్తి తీసుకుంటున్నారని ఆయన మోదీ పనితీరును తప్పుపట్టారు. ఒకే వ్యక్తి అన్నింటికీ సమాధానం ఇవ్వలేరని, సంప్రదింపులు, చర్చలు అవసరమని చెప్పారు. ప్రతిపక్షంతో ప్రధాని ఎన్నడూ సంభాషించలేదని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రతిపక్షాలను సంప్రదించేవారని, కనీసం ఫోన్లోనైనా కాంగ్రెస్ నేతలతో మాట్లాడేందుకు ప్రధాని ఆసక్తి చూపలేదని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more