a wife named vijayalakshmi killed husband narasimha with support of boyfriend suri to continue their illegal relationship | illegal relationships after marriage

Wife killed husband along with boyfriend to continue her illegal relationship

wife killed husband, husband killed by wife, wife killed husband with boyfriend, wife illegal relationship, wife murdered husband, wife boyfriend killed husband, vijayalakshmi killed husband narasimha

wife killed husband along with boyfriend to continue her illegal relationship : a wife named vijayalakshmi killed husband narasimha with support of boyfriend suri to continue their illegal relationship.

ప్రియుడికోసం భర్తను హతమార్చిన భార్య

Posted: 11/16/2015 02:51 PM IST
Wife killed husband along with boyfriend to continue her illegal relationship

భర్తతో కలిసి సంతోషంగా జీవితాన్ని కొనసాగించాల్సిందిపోయి.. ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. తన జీవితానికి భరోసానిచ్చి కలకాలం తోడుంటానని వందలమంది సమక్షంలో మాటిచ్చి, భరోసా కల్పించిన వ్యక్తి కాదనుకుని.. కొద్దిరోజుల క్రితమే పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోయింది. అంతటితో ఆగలేదు.. తమ అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డొస్తాడోనని భావించిన ఆమె.. తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా తన భర్తను హతమార్చింది. అనంతరం అనుమానం రాకుండా వుండేందుకు తన భర్త శవాన్ని చెరువలో పడేసింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె అసలు రంగు బయటపడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని సోమవారం వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం వరాహపట్నంకు చెందిన లక్ష్మినరసింహస్వామికి పదేళ్ల క్రితం విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన రెండేళ్ల వరకు వీరి వైవాహిక జీవితం సుఖంగానే సాగింది. కానీ.. ఇంతలోనే విజయలక్ష్మికి సూరి అనే వ్యక్తి పరిచయం ఏర్పడగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన భర్తకు, గ్రామస్థులకు ఎవ్వరికీ అనుమానం రాకుండా కొన్నాళ్లు ఆమె అతనితో అక్రమ సంబంధం కొనసాగించింది. అయితే.. ఆ తర్వాత ఈ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. దాంతో దంపతుల మధ్య గొడవలు ఏర్పడి.. విడిపోయారు. అప్పటి నుంచి విజయలక్ష్మి తన ప్రియుడు సూరితో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చింది. అలాగే.. తన భర్త మీద పగ పెంచుకుంటూ వచ్చింది. భర్తను ఎలాగైన మట్టుబెట్టాలని విజయలక్ష్మి పథకాలు పన్నుతూ వచ్చింది కానీ.. సరైన సమయం కోసం వేచి చూసింది. చివరాఖరికి ఆమె తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అందుకు ఓ ప్లాన్ కూడా రచించింది.

పథకం ప్రకారం.. విజయలక్ష్మి తన ప్రియుడు సూరి, మరో వ్యక్తితో కలిసి ఒంటరిగా వున్న తన భర్త లక్ష్మినరసింహస్వామిని వారం రోజుల క్రితం అత్యంత కిరాతరంగా హతమార్చారు. అనంతరం అతని శవాన్ని చేపల చెరువులో పడేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ హత్య వెనకున్న గుట్టును రట్టు చేశారు. అతని భార్యే తన ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి హతమార్చిందని తెలుసుకున్న పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles