రైల్వే ప్రయాణికులకు ఒకేసారి గుడ్, బ్యాడ్ వార్తల్ని ముందుకు తీసుకొచ్చింది రైల్వేశాఖ. ప్రయాణికుల జర్నీ విషయంలో ఆ శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. గుడ్ న్యూస్ ఏమిటంటే.. రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని రైల్వేశాఖ అమల్లోకి తీసుకొచ్చింది.
రైలు బయలుదేరడానికి కొన్ని నిముషాల ముందు కొందరు తమ రిజర్వేషన్లను రద్దు చేస్తుంటారు. దాంతో బెర్తులు ఖాళీగా వుండిపోతున్నాయి. అలా ఖాళీగా వదిలేయడం కంటే వాటిని కూడా భర్తీ చేస్తే ఆదాయం బాగా వుంటుందని చాలా ఆలస్యంగా పసిగట్టిన అధికారులు.. ‘30 నిముషాల ముందు రిజర్వేషన్’ అనే ప్రణాళికను తీసుకొచ్చింది. దీంతో.. అందుబాటులో వున్న సీట్ల ఆధారంగా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నమాట. ఈ నేపథ్యంలో రైలు బయలుదేరడానికి ముందు ఇప్పటివరకు ఒకసారే చార్ట్ ప్రిపేర్ చేసే అధికారులు.. లేటెస్ట్ రూల్స్ ప్రకారం రెండుసార్లు సిద్ధం చేయాల్సివుంటుంది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు తొలిఛార్జ్ను రెడీ చేస్తారు. అప్పటికీ ఆ రైల్లో బెర్తులు ఖాళీగావుంటే ఆ తర్వాత ప్రయాణికులు ఇంటర్నెట్ ద్వారా గానీ, రిజర్వేషన్ కౌంటర్ల నుంచి టికెట్లు తీసుకోవచ్చు. రైలు బయలుదేరే అరగంట ముందు టీటీఈలకు కొత్తచార్ట్ను అందజేస్తారు. ఈ సదుపాయం వల్ల బెర్తుల్ని వినియోగించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నది అధికారుల ప్లాన్. దీనివల్ల దళారులను తగ్గించవచ్చునని భావిస్తున్నారు.
ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. టికెట్ క్యాన్సిల్లోనూ కొత్త రూల్స్ రానున్నాయి. ప్రస్తుతం అమలులోవున్న నిబంధనల ప్రకారం.. టిక్కెట్ కొన్నాక రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు రద్దు చేసుకుంటే రిజర్వేషన్ ఛార్జీలే కోల్పోవాల్సి వుండేది. అదే 6 గంటల ముందు వరకైతే 25 శాతం టిక్కెట్ డబ్బులు లాస్ అవుతారు. 2 గంటల ముందు అంటే టిక్కెట్ ధరలో 50శాతం వదులుకోవాల్సిందే! కానీ.. కొత్త రూల్స్ ప్రకారం.. ఈ ఛార్జీలు రెట్టింపు కానున్నాయి. రైలు బయలుదేరాక కొన్న టిక్కెట్ క్యాన్సిల్ అయితే ఇక డబ్బులు పూర్తిగా వదులుకోవడమే! ఈ కొత్త నిబంధనలు నేటి (గురువారం (12-11-2015)) నుంచి అమలులోకి రానున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more