అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి సందర్భంగా వాడే టపాసుల్లో ప్రమాదకరమైన రసానయనాలు వుంటాయి. ఆ టపాసుల్ని పేల్చినప్పుడు వెలువడే ఆ హానికారకమైన రసాయనాలు శరీరానికి, మెదడకు అనేక రకాలుగా నష్టాలు కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా బాణసంచాలో వాడే అల్యూమినియం, ఆర్సెనిక్ సల్ఫైడ్లు కొంతమందిలో చర్మానికి చేటు చేస్తాయి. ఇవి తగిలినప్పుడు చర్మం ఎర్రగా కందిపోయే అవకాశం ఉంటుంది. ఈ రసాయనాలున్న టపాసులు కాల్చినప్పుడు కళ్లు ఎర్రబడడం, దురద పెట్టడం జరగవచ్చు. మరికొందరిలో గొంతు మంట, దురద రావచ్చు. శ్వాస తీసుకోవడంలోనూ తీవ్ర ఇబ్బంది ఏర్పడే ప్రమాదం వుంటుంది. టపాసుల శబ్దాలు, కాలుష్యం వల్ల కొందరికి తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. ఇక అన్నింటికంటే పెద్ద ప్రమాదం వళ్లు కాలడం. పెద్దపెద్ద టపాసులు, బాణసంచాలు, బాంబులు కాల్చినప్పుడు ఇలా సంభవంచే అవకాశం వుంది. ఇలా రకరకాల సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి అనుకూలంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఈ దీపావళిని మరింత సంతోషంగా జరుపుకోవచ్చు.
* పొగ ఉన్న ప్రదేశానికి దూరంగా వెళ్లాలి. ఏదైనా గదిలోకి వెళ్లి తలుపులు, కిటికీలు మూసేసి, ఏసీ ఉంటే అది ఆన చేసి కూర్చోవాలి. ఆస్తమా ఉన్నవారిలో శ్వాస సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున వారు ఇనహేలర్, నెబ్యులైజర్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. అవి వాడినా పరిస్థితి మెరుగు కాకపోతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
* ఊపిరితిత్తుల వ్యాధులు, ఎలర్జీలు ఉన్నవారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకపోవడం మంచిది. అది సాధ్యం కాకపోతే ఎన్95 మాస్క్ను తప్పనిసరిగా వాడాలి. ఇది గాలిలో ఉండే కాలుష్యాన్ని 95 శాతం వరకూ వడపోయగలుగుతుంది. ఇనహేలర్స్ను అందుబాటులో ఉంచుకోవాలి.
* కాలిన చోట చర్మం పగలకపోతే, కాలిన గాయం 4 నుంచి 5 సెంటీమీటర్లకు మించి లేకపోతే దానికి ఇంటివద్దే చికిత్స పొందవచ్చు. కాలిన గాయంపై 15-20 నిముషాలపాటు నీళ్లు ధారగా పడేటట్టు చేయాలి. దానిపై ఐస్ మాత్రం పెట్టవద్దు. కాలిన చోట యాంటీ బయాటిక్ ఆయింట్మెంట్ రాయాలి. దూదిని ఉపయోగించకూడదు. ముఖంపై గాయాలైన పక్షంలో డాక్టర్ వద్దకు తప్పనిసరిగా వెళ్లాలి.
* చర్మం ఎర్రగా కందిపోయినట్టు అనిపిస్తే వెంటనే నీటితో కడిగి కాలమైన లోషన రాయాలి. అయినా తగ్గకపోతే సెట్రిజిన వాడాలి. కళ్లు దురదపెడుతుంటే కళ్లను నలపవద్దు. మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి. గొంతు మంట పుడితే లవంగాలు, మిరియాలు, తేనె వంటివి వాడడం మంచిది. టపాసులు కాల్చడానికి ముందు పొడుగు చేతులున్న కాటన్ చొక్కాలు ధరించాలి.
* టపాసులు కాల్చినప్పుడు వచ్చే భీకర శబ్దాల కారణంగా తలనొప్పి సమస్య ప్రతిఒక్కరికి ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే పారాసెటమాల్ వేసుకోవాలి. మంచినీళ్లు, నిమ్మరసం, కొబ్బరి నీళ్ల వంటివి ఎక్కువగా తాగాలి. తల తిరగడంతోపాటు వాంతులు కూడా వస్తుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more