ఓ నైట్క్లబ్లో అనుకోకుండా జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఏకంగా ‘ప్రధాని’ పదవికే ఎసరు పెట్టింది. ఆ దుర్ఘటన జరిగిన నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనన, ఆందోళనలను సదరు దేశ ప్రధానిని తీవ్రంగా కలచివేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ అగ్నిప్రమాదం కారణంగా ఏకంగా దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేయడంతో ఈ విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇటీవల రొమేనియాలోని బుకారెస్ట్లో గల ఓ నైట్క్లబ్లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 33 మంది మరణించగా.. దాదాపు 180 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. కానీ, క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఏదేమైనా.. ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని, ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని భారీ ఎత్తున ఆందోళనకారులు బుకారెస్ట్ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహింటారు. విశేషం ఏమిటంటే.. ఈ ఆందోళనలో దాదాపు 20 వేలమంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని హింసాత్మకమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
ఈ విధంగా భారీగా ఆందోళన వెల్లువెత్తడంతో ఆశ్చర్యానికి గురైన ఆ దేశ ప్రధాని విక్టోర్ పాంటా.. తన పదవికి రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు. 'నా బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను' అని పాంటా చెప్పినట్లు డ్రాగ్నియా చెప్పారు. ఆ ఘటనకు బాధ్యత వహించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రధాని పదవికి పాంటా రాజీనామా చేస్తారని తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more