చాలా మందికి పుర్రెలు, ఎముకలు కనిపిస్తే చాలా భయమేస్తుంది. కానీ వాటినే చూసేందుకు ఓ చర్చికి చాలా మంది పర్యాటకులు వెళుతున్నారు. అవును.. చర్చ్ కే వెళుతున్నారు. చర్చ్ లో ఉన్న పుర్రెలు, ఎముకలే అక్కడ అద్భుతాలు కాబట్టి. దాదాపు 40 వేల అస్థిపంజరాలతో ఆ చర్చిని డిజైన్ చేశారు. చెక్ రిపబ్లిక్ రాజధాని పరాగ్వేకు సమీపంలో ఉన్న సెడ్లాక్ ఊళ్లో ఆ చర్చి ఉంది. దీన్ని ముద్దుగా బోన్ చర్చి అని పిలుస్తారు. ఇక్కడికి రోజుకు వేల మంది వస్తుంటారు. ఎంతో మంది పర్యాటకులను ఈ చర్చ ఆకర్షిస్తోంది.
1278వ సంవత్సరంలో సెడ్లాక్కు చెందిన ఓ వ్యక్తి జెరుసలాం వెళ్లాడు. అతను అక్కడి మట్టిని తెచ్చి ఆ ఊళ్లో చల్లాడు. ఆ పవిత్ర స్థలం శ్మశాన వాటికగా మారింది. దీంతో స్థానికులు అక్కడే శవాలను పాతిపెట్టడం మొదలుపెట్టారు. ఆ సాంప్రదాయం 14వ శతాబ్ధం వరకు కొనసాగింది. అప్పుడే యూరోప్ అంతా ప్లేగ్ ప్రబలింది. ఆ వ్యాధి వల్ల 30వేల మంది బలయ్యారు. వాళ్లను ఇక్కడే పూడ్చారు. ఆ తర్వాత మతయుద్ధాల వల్ల సెడ్లాక్ ప్రాంతంలో మరో 10వేల మంది చనిపోయారు. వాళ్లను కూడా అక్కడే పాతిపెట్టారు. 15వ శతాబ్ధంలో చర్చి నిర్మాణం కోసం శవాలు పాతిపెట్టిన ప్రాంతాన్ని తొవ్వారు. 1870 వరకు ఆ అస్థిపంజరాలను ఎవరూ ముట్టుకోలేదు. ఆ తర్వాత స్థానిక శిల్పితో ఓ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో ఎముకలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పుర్రెల దండలు చర్చి విజిటర్స్ను ఆహ్వానిస్తాయి. ఇక వెన్నుపూసలతో చేసిన శాండిలీర్ ఆ చర్చికే అట్రాక్షన్ పాయింట్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more