మొత్తానికి ఏపి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ఇప్పుడు పెరుగుతాయి.. ఇప్పుడు అంటూ వార్తలు ఎన్నో సార్లు వచ్చినా నిన్న ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా చకచకా జారీ అయింది. తాజాగా ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఐదు నుంచి పది శాతం మేర ఛార్జీలు పెంచింది ఆర్టీసీ. పెరిగిన బస్సు ఛార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. ఆర్టీసీ బస్సు చార్జీలను తక్షణమే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెవెలుగు బస్సు చార్జీలు 5 శాతం మేరకు పెరగగా, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో చార్జీలను 10 శాతం మేరకు పెంచారు.
పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 3 పైసలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసులలో అయితే కిలోమీటరుకు 8 పైసల వంతున పెంచారు. అదే సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల సర్వీసులలో అయితే కిలోమీటరుకు 9 పైసల వంతున చార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ – విజయవాడ మధ్య ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 213 రూపాయలు చార్జి చేస్తుండగా ఇకనుంచీ రూ. 235 వసూలు చేస్తారు. డీలక్స్ బస్సు టికెట్ 240 నుంచి 264 రూపాయలకు పెరిగింది. సూపర్ లగ్జరీ బస్సు చార్జీలు 283 రూపాయలు ఉండగా ఇక 303 రూపాయలు చెల్లించుకోక తప్పదు. ఇక ఏసీ, ఇంద్ర, గరుడ, రాజహంస బస్సుల్లోనూ ఎక్కువ చెల్లించాల్సిందే. కాగా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మెన్ మాత్రం పేద వారికి ఆర్టీసీ చార్జీలు భారం కావు అంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం కొసమెరుపు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more