రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూములిచ్చిన 23 వేల మంది రైతులను శంకుస్థాపనకు ఆహ్వానించి పెద్దపీట వేసి గౌరవిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా అది అములుకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రతి గ్రామంలో రైతుల ఇళ్లుకు వెళ్లి ఆహ్వాన పత్రికతోపాటు యజమాని, యజమానురాలికి పంచె, ధోవతి, చీర ఇచ్చి బొట్టుపెట్టి ఆహ్వానం పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతలను పలువురు ఎంపిక చేసిన మహిళలకు అప్పగించింది. కానీ ఇప్పటికీ అనేక గ్రామా రైతులకు ఆహ్వానాలు అందకపోవడంతో.. ఎదురు చూడటం వారి వంతైంది.
శనివారం సాయంత్రం తొలిసారి నేలపాడు నుంచి అట్టహాసంగా చీర, పంచె, ధోవతితోపాటు స్వీట్ బాక్స్ ఇచ్చి పంపిణీ ప్రారంభించింది. ఈ హడావుడి కేవలం నేలపాడు, తుళ్ళూరు గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. పండుగ వేళ మిఠాయిలతో రైతులను పలుకరించాలన్న ప్రభుత్వ సంకల్పానికి టీడీపీ నేతలు గండి కోడుతున్నారు. స్వీట్లను అమాంతం మెక్కేసిన నేతలు కేవలం చీర, పంచెలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అయితే శనివారం నాడు ఇచ్చిన ఆహ్వాన తాంబులంలో చీర, పంచెలు బాగున్నాయి. అయితే ఆ తరువాత రోజునుంచి పంపిణీ చేస్తున్న చీర, పంచెలను చూసి స్థానికులు ప్రభుత్వ ప్రచారార్భాటాలను గొప్పగా వున్నాయి.. కానీ తమకిచ్చిన చీర పెంచెలు మాత్రం ఇంత నాసిరకంగా వున్నాయని నవ్వుకుంటున్నారు.
పంచెకు అంచు ఉండదు....చీరకు చెంగు ఉండదు. ఏవీ వేసుకోడానికి పినికిరావు. వీటితో ఎలా అని రాజధాని రైతులు బిక్కమొహం వేస్తున్నారు. రాజధానికి కోట్ల రూపాయల భూములను తాము ఇస్తే.. తమకు ఇంతటి నాసిరకం చీర, పంచెలిస్తారా అంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం అందించిన నాసిరకం వస్త్రాలను.. అమారావతి ప్రాంతంలోని అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల రైతులు తిరస్కరించారు. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి వల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు.
ఈ వస్త్రాలు ఇవ్వకపోయినా బాగుండేదని ఇచ్చి తమను అవమానించారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన వస్త్రాల్లో నాణ్యత లోపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అప్పలరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, తుళ్లూరు, వెంకటపాలెం వంటి గ్రామాల్లో మరింత నాసిరకం బట్టలు రావడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more