ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి ప్రేమ ఎక్కువైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సమాధిలో పెట్టేసిన ఏపి ప్రజలను ఇంప్రెస్ చెయ్యడానికి రాహుల్ గాంధీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగా గత వారంలోనే రఘువీరా రెడ్డితో పలువురు ఏపి కాంగ్రెస్ నాయకులకు రాహుల్ స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. తాజాగా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోవాలని లేఖలో కోరారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందని కావున దీనిపై త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పేజీ లేఖలో రాహుల్ అనేక విషయాలను పేర్కొన్నారు. ఇటీవల తాను రెండుసార్లు ఏపీలో పర్యటించిన సందర్భంలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని లేఖలో తెలిపారు.
విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఏపీకి న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల మిగిలిన రాష్ట్రాలతో కలిసి ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పారు. ఈనెల 22న జరిగే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని రాహుల్ లేఖలో విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాసిన విషయం తెలిసిందే. మొత్తానికి మొన్నామధ్య తల్లి సోనియా గాంధీ రాసిన లెటర్ కు ఎలాంటి జవాబు ఇవ్వని మోదీ మరి రాహుల్ గాంధీ రాసిన లేఖకు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు టైం దగ్గర పడిన టైంలో రాహుల్ గాంధీ ఏపి కాంగ్రెస్ వర్గాలకు ఉత్సాహాన్ని నింపడానికి.. కాంగ్రెస్ పై ప్రజలకు కాస్త మంచి అభిప్రాయం ఏర్పడేలా రాహుల్ మోదీకి లేఖ రాశారు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more