పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజిర్ బుట్టో హత్యకు పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫే కారణమని అమెరికన్ జర్నలిస్ట్ మార్క్ సీగల్ తెలిపారు. బుట్టో హత్యకేసులో రావల్పిండి కోర్టులో ఆయన సాక్ష్యం చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ముషారఫ్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్టు భుట్టో తనతో చాలాసార్లు మొరపెట్టుకున్నట్టు ఆయన వివరించారు. ఈనెల ఒకటిన పాకిస్తాన్లోని రావల్పిండి టెర్రరిజమ్ కోర్టు ఎదుట వాషింగ్టన్లోని పాక్ ఎంబసీ నుంచి వీడియో లింకేజీ ద్వారా హాజరైన సీగల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బెనజిర్ బుట్టో హత్య కుట్రకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచిన ఫోన్ సంభాషణను గల్ఫ్ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి ట్రేస్ చేసిందని పేర్కొన్నారు. ఈ సంభాషణను బట్టి ముషారఫ్ సహచరులు ముగ్గురు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. భుట్టో హత్యకు ముషారఫే కారణమని, దానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 1998 నుంచి 2008 వరకు పాక్ను పాలించిన ముషారఫ్(72) నుంచి భుట్టో పలుమార్లు బెదిరింపులు ఎదుర్కోవడం దీనికి బలాన్ని ఇస్తోందని సీగల్ వాంగ్మూలం ఇచ్చారు.
తన రక్షణకు ఫారిన్ సెక్యూరిటీని రప్పించాలని బెనజిర్ భుట్టో చాలాసార్లు ముషారఫ్ను అభ్యర్థించినా ఆయన పెడచెవిన పెట్టారని సీగల్ పేర్కొన్నారు. బాంబు దాడిలో బెనజీర్ చనిపోవడానికి ముందు ఆమె సెక్యూరిటీ సిబ్బందికి ముషారఫ్ మొబైల్ జామర్స్ ఇచ్చినా అవి పనిచేయలేదని తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉండగానే రెండుసార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన బెనజిర్ భుట్టో 2007లో రావల్పిండిలో జరిగిన బాంబుదాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముషారఫ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే తనపై ఉన్న ఆరోపణలను ముషారఫ్ కొట్టివేశారు. మరోవైపు చాలా ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో సీగల్ వాంగ్మూలం కీలకం కానుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
May 18 | పూర్వ కాలంలో ఆహారం వేరు. వాళ్లు ఎక్కువగా సిరిదాన్యాలతో కూడిన ఆహారం అందులోనూ ఎక్కువగా రోటీల రూపంలో తీసుకునేవారు. వాటితో వారికి కావాల్సినంత బలం అందడమే కాదు.. ఎలాంటి రోగాలనైనా ఎదుర్కోనే రోగనిరోధక శక్తి... Read more
May 18 | గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్... Read more
May 18 | సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ వైఎస్ జగన్... Read more
May 18 | విద్యార్ధులకు విద్యాబుద్దులు చెప్పి..వారిని సన్మార్గంలో నడిచేలా చేస్తూ.. తప్పుఒప్పులను సరిచేయాల్సిన బాధ్యత ఉన్న పాఠశాల యాజామాన్యం.. తప్పును తప్పని చెప్పలేని పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, తమ గూటికి చెందిన... Read more
May 17 | నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతూ పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు రోజుకో పూట బోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు కారణమైన... Read more