ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’పై మొదటి నుంచి ఎన్నో వివాదాలు రాజుకుంటూ వచ్చాయి. తొలుత భూసేకరణ విషయమై కొందరు రైతులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. మరోవైపు విపక్ష పార్టీలు సైతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటోందంటూ ఆరోపణలు చేస్తూ.. రైతులను రెచ్చగొట్టిన సందర్భాలూ వున్నాయి. అయితే.. ఆ వివాదాలు ఎలాగోలా సమసిపోయాయి. రాజధాని నిర్మాణానికి అన్ని పనులు సన్నద్ధమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి కూడా. కానీ.. ఇంతలోనే మరో వివాదం తెరమీదకొచ్చింది. అమరావతి నిర్మాణానికి హాజరు కావాలంటూ ప్రముఖుల కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికపై తాజాగా ఈ వివాదం రేగింది.
తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని అని గొప్పగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ఆహ్వాన పత్రం ఆంగ్లంలో ముద్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు భాషోద్యమ సమాఖ్య నేత సామల రమేష్ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి ఆహ్వాన పత్రికను తెలుగులో ముద్రించకపోతే తాము ఆందోళన చేస్తామని అన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధాని నిర్మాణానికి కూడా ఆంగ్ల ఆహ్వాన పత్రిక ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే తెలుగులో ఆహ్వాన పత్రికను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చారు. ఈయన డిమాండ్ కు మరికొందరు తెలుగు భాషా ప్రేమికులు మద్దతుగా నిలిచారు. మరి.. ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! మరోవైపు.. ఈ వివాదాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more