ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న దీక్షకు బ్రేక్ పడింది. ఆరు రోజుల పాటు కొనసాగిన జగన్ నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జగన్ ఆరోగ్యం క్షీణించండం. కిటోన్స్ లెవెల్ 3+కు పడిపోవడం, మరోవైపు దీక్షా స్థంలో వద్ద ఆందోళనలను పెరగడంతో జగన్ దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. తెల్లవారు జామున పోలీసులు జగన్ను బలవంతగా ఆస్పత్రికి తరలించారు. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో దీక్షా స్థలికి వచ్చిన పోలీసులు 4.11 గంటలకు వైఎస్ జగన్ తో తొలుత మంతనాలు జరిపే ప్రయత్నం చేశారు. మరోపక్క, పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడే ఉన్న ముఖ్యనాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై వారిపై లాఠీ చార్జి జరిపి జగన్ ను బలవంతగా దీక్ష శిబిరం నుంచి ఎత్తుకెళ్లారు. 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తాను దీక్ష విరమించబోనని, తన నిరాహార దీక్షను ఆపలేరని, ఒక క్రమబద్ధంగానే తాను దీక్ష చేస్తున్నాను తప్ప ఎవరికీ ఎలాంటి హానీ చేయడం లేదని జగన్ చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు ఆయన మాట వినలేదు.
అంతకముందు ప్రత్యేక హోదా కోసం ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి. జగన్ ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల.. ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అన్నారు వైద్యులు. గుండె, కిడ్నీ, మెదడుమీద ప్రభావం పడి.. జగన్ కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వైసీపీ నేతలు జగన్ ఆరోగ్యం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఓ కార్యకర్త దీక్షాప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. మిగిలినవాళ్లు అతడ్ని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓ వైపు కార్యకర్త ఆత్మహత్యాయత్నంతోనే టెన్షన్ నెలకొంటే.. మరోవైపు జగన్ దీక్ష శిబిరానికి దగ్గర్లో అర్ధరాత్రి.. కొందరు దుండగులు ఓ బస్సుకు నిప్పంటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more