ఎన్నికల సిత్రాలు ఎన్నో వింతలక, విడ్డూరాలకు చోటిస్తాయి. మాటల తూటాలకు అయితే ఆకాశమే హద్దుగా ఉంటుంది. అందుకే మరి బీహార్ ఎన్నికల్లో నాయకుల మధ్య మాటల తూటాలు మామూలుగా పేలడం లేదు. తారా స్థాయిలో నడుస్తున్న బీహార్ ఎన్నికల సభల్లో మాటల సమరం అంతకంతకు తారా స్థాయికి చేరుతున్నాయి. నిన్నటి సభలో మోదీ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎద్దేవా చేశారు. పాపం లాలూ ప్రసాద్ యాదవ్ కు షైతాన్ పట్టిందని.. అయినా అంత మంది సభలో ఉండగా లాలూ ప్రసాద్ నే షైతాస్ ఎందుకు పట్టుకుంది అని మోదీ ప్ర్రశ్నించారు. అంతకు ముందు లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. హిందువులు కూడా గోమాంసాన్ని తింటున్నారని అన్నారు. అయితే మీడియా మిత్రులు దాని మీద ప్రశ్నించడంతో వెంటనే ఆ టైంలో నాకు షైతాన్ పట్టుకుందని సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ మోదీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీహార్ లో వాతావరణం చాలా వేడి ఉంది. అక్కడి నాయకుల మాటలతో యుద్దాలు జరుగుతున్నాయి. మాటల తూటాలకు అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ మోదీ మీదకు కయ్యానికి సిద్దపడితే.. మోదీ కూడా కయ్యానికి సిద్దం అని తొడగొట్టారు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ ను షైతాన్ అని సంబోదించిన మోదీకి లాలూ తాజాగా కౌంటర్ వేశారు. నరేంద్ర మోదీని బ్రహ్మపిశాచి అని సంబోదించిన లాలూ.. బ్రహ్మపిశాచిని ఎలా వదిలించాలో కూడా డాక్టర్ గా లాలూనే పరిష్కారం చెబుతున్నారు. పొగవేసి.. ఎండు మిర్చిలు కాలిస్తే పట్టిన బ్రహ్మపిశాచి బీహార్ ను పరుగెడుతుందని లాలూ అన్నారు. మొత్తానికి మోదీ లాలూను షైతాన్ అనడం.. లాలూ మోదీని బ్రహ్మపిశాచి అనడంతో మీడియా వాళ్లకు వార్తలు చూసే జనాలకు ఎంటర్ టెన్ మెంట్ ఉంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more