బీహార్ లో ఎన్నికల వాతావరణం రోజురోజుకు అక్కడి పరిస్థితులను మార్చేస్తోంది. అక్కడి పొత్తులు, ఎత్తులు రాజకీయ విశ్లేషకులకు సైతం విస్తు కలిగిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన బీహార్ ఎన్నికల సమరంలో అందరూ అస్ర్తశస్త్రాలతో యుద్దానికి సిద్దపడ్డావాళ్లే. తాజాగా అక్కడి ఎన్నికల ప్రచారంలో అందరూ బిజీగా మారారు. బిజెపి పార్టీ బీహార్ ఎన్నికలను ఎంతో కీలకంగా భావిసస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్ కు ఎలాగైనా సరే అధికారాన్ని దూరం చెయ్యాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. అయితే లాలూ ప్రసాద్ కూడా చాలా స్ట్రాటెజిక్ గా వ్యవహారిస్తున్నారు. రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తూనే తన చరిష్మాను కూడా కాపాడుకుంటున్నారు. బీహార్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్న లాలూ ప్రసాద్ తాజాగా రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మీద లాలూ ప్రసాద్ రాజకీయ ఎత్తుగడ అని చాలా మంది చర్చించుకుంటున్నారు.
బీహార్ ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీతో కలిసి పాలుపంచుకున్నారు. అంతకంతకు రంజుగా మారిన ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో ఎవరు ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా హా్ట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా సోనియా గాంధీతో కలిసి లాలూ ప్రసాద్ పాల్గొన్న ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చింది. అందులో భాగంగా రాహుల్ గాంధీతో తాను కలిసి ఎన్నికల ర్యాలీలు నిర్వహించలేనని. అలగ్ అలగ్ అని అన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చెయ్యలేను కానీ ఎన్నికల్లో మాత్రం మైత్రి కొనసాగుతుందని అన్నారు. మొత్తంగా లాలూ ప్రసాద్ కూడా తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ఎన్నికల్లో నెగ్గుకురావాలని చూస్తున్నారు. రాజకీయం అంటు ఇదే మరి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more