ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ‘ఏపీకి ప్రత్యేకహోదా’ కోసం గతకొన్నాళ్ల నుంచి పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! ఈయన చేపట్టిన పోరాటం మొదలు ఇతర రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన నిరసనలో భాగంగా కలిసి నడిచారు. బహుశా ఈయన స్ఫూర్తితోనే కాంగ్రెస్, వైకాపా పార్టీలు దిగొచ్చాయేమోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వెల్లడించిన సందర్భాలూ లేకపోలేదు. ఆ విషయాలు కాస్త పక్కనపెడితే.. గత నాలుగు రోజులుగా మీడియా కంటపడకుండా సైలెంట్ గా వున్న శివాజీ.. తాజాగా తెరముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. ఆగస్టు 15ను సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు పంచినట్లుగా ఏపీకి తక్కువ మొత్తాన్ని ప్యాకేజీల రూపంలో ఇచ్చి సరిపుచ్చారని ఆయన విమర్శించారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా మీడియాతో మాట్లాడిన శివాజీ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నేతలు పచ్చి బూతులు, అబద్ధాలు మాట్లాడుతున్నారని, అందువల్లే తాను మనిషిగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. నాలుగు రోజులు తాను కనబడకుంటే ఇష్టానికి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీకి ఇంకా రూ. 14 వేల కోట్లు రావాల్సి వుందని, దాన్నే ఇంకా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. దాన్ని ఏపీ ప్రభుత్వం తెచ్చుకోలేకపోయిందని అన్నారు. కేంద్రం రూ. 8 వేల కోట్లు ఇచ్చిందని మంత్రి సుజనా చౌదరి చెప్పడం, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడమేనని అన్నారు. పిల్లలకు పంచే పప్పూ బెల్లాల్లాగ, ఆగస్టు 15కు చాక్లెట్లు ఇచ్చినట్టు ఉత్తరాంధ్రకు, రాయలసీమ జిల్లాలకు రూ. 50 కోట్ల చొప్పున ప్యాకేజీలు ఇచ్చి సరిపుచ్చాలని భావిస్తున్నారని విమర్శించారు. అవి కూడా ఇప్పటికిప్పుడు రావని అన్నారు. నేతలంతా డ్రామాలాడుతున్నారని, ఎంతకాలం ఇలా మోసం చేస్తారని ప్రశ్నించారు.
నేతలు నిజాయతీ తప్పి సొంత లెక్కలు, పాత లెక్కలు చూబితే సహించబోమని అన్నారు. ప్రకృతి సహకరించి, వర్షాలు కురవబట్టే ప్రజలు కొంత సంయమనంగా ఉన్నారని ఆయన అన్నారు. కుర్చీకోసం చెత్తరాజకీయాలెన్నాళ్లని ఆయన ప్రశ్నించారు. ప్రతి మంత్రి ఆస్తుల లెక్కల చిట్టా తనదగ్గరుందని, ఏమంత్రికి ఎంత ఆస్తిఉందో తనకు తెలుసునని, అందరి లెక్కలు తేలుస్తానని శివాజీ అన్నారు. నెలరోజుల నుంచీ ఇదేపనిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 2న హోదా సాధన పేరిట దీక్ష చేపడుతున్నట్టు ఆయన ప్రకటించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more