ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని ‘అమరావతి’ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు వేగవంతంగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నూతన రాజధాని నిర్మాణం ఊపందుకోవడం కోసం ఆ ప్రాంతంలో సర్కారు కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కోసం 20 ఎకరాల్లో అమరావతి టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది. అలాగే.. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిపై అత్యాధునిక టెక్నాలజీతో రెండు ఐకాన్ బ్రిడ్జెస్ (వంతెనలు) నిర్మించేందుకు ఆ సంస్థ యోచిస్తోంది. ఇలా అమరావతి నిర్మాణంలో భాగంగా పనులు వేగవంతంగా జరుగుతుండగానే.. తాజాగా కేంద్రం అమరావతి చుట్టూ 185 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు వేసేందుకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 800 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.
కర్నూలు మీదుగా అనంతపురం, అమరావతిని కలుపుతూ ఎన్హెచ్ 44, ఎన్హెచ్ 65తో అనుసంధానించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అలాగే కర్నూలు, కడప, అనంతపురాలను కలుపుతూ ఎన్హెచ్ 40, ఎన్హెచ్ 60లను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న రహదారులను 6, 8 లేన్ల జాతీయ రహదారులుగా మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తిచేస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా.. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి నిర్మాణాన్ని ఆయా దేశ పారిశ్రామిక వేత్తలకు చూపిస్తూ.. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం, రాజధాని ప్రాంతాలు అనువుగా వుంటాయని పేర్కొంటున్నారు. దీంతో కొన్ని పారిశ్రామిక సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అమరావతి నిర్మాణ పనులు దసరా నుంచి ప్రారంభం కానున్న సంగతి విదితమే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more