భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ తాగుబోతు ఆమెను అత్యంత దారుణంగా హింసించాడు. ఆ హింసను తట్టుకోలేకపోయిన ఆమె చివరికి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం పక్కనే కూర్చొని లోపల గడియ వేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోకి బరేలిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఇంటికి సమీపంలోనే వుండే సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బరేలిలోని నారియావాల్ జిల్లాకు చెందిన రాజీవ్ శర్మకు ఓ మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగింది. వీరికి ఓ కొడుకు కూడా జన్మించాడు. అయితే.. గతకొన్నాళ్ల నుంచి రాజీవ్ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ తాగి తన భార్యతో గొడవకు దిగేవాడు. అయినప్పటికీ ఆమె ఎంతో ఓర్పుతో వుంటూ, అతనితో జీవనం కొనసాగించింది. కానీ.. అతని ఆగడాలు రోజురోజుకు పెరుగుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ విపరీతంగా మద్యం తాగి తన భార్యతో గొడవకు దిగాడు. తన కోరికను తీర్చాల్సిందేనని మొండికేశాడు. అయితే ఆమె అతని కోరికను తిరస్కరించింది. అంతే.. కోపోద్రిక్తుడైన రాజీవ్ ఆమెపై దాడికి దిగాడు. ఢిల్లీ నిర్భయ ఉదంతం తరహాలో ఆమెపై లైంగికంగా దారుణమైన దాడి చేశాడు. ప్రాణాలు పోయేదాకా వదిలి పెట్టలేదు. బాధితురాలి శరీరంపై గాయాలు లేవు గానీ, విపరీతమైన రక్తస్రావంతోనే కన్నుమూసిందని పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు.
రాజీవ్ శర్మపై కేసు నమోదు చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భార్యను హత్య చేయడానికి ముందుకు ఆరుగంటల నుంచి మద్యం తాగినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీస్ అధికారి రజ్బీర్ సింగ్ తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more