ఏపీ సీఎం చంద్రబాబు నాయుడకి సమీప బంధువు, బీజేపీ నేత అయిన దగ్గుబాటి పురందేశ్వరి చురకలంటించారు. నిజానికి వీరిద్దరి మధ్య ఎన్నాళ్లనుంచో విభేదాలున్నాయి. గతంలో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే! అయితే.. గడిచిన ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ చేతులు కలపడం, బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందడం, పురందేశ్వరి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అవడం అంతా జరిగిపోయాయి. దీంతో ఆమెకు, బాబుకు మధ్య విభేదాలు సమసిపోయాయని, బంధువులు తిరిగి ఒక్కటయ్యారని అనుకున్నారు. కానీ.. ఇప్పటికీ వారిమధ్య వైరుధ్యాలు వున్నాయని తాజాగా పురందేశ్వరి వ్యాఖ్యలు తెలుపుతున్నాయి. బీజేపీలోకి ఎంట్రీ అయిన తర్వాత ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్న ఆమె.. ఇప్పుడు మైకు ముందుకు వచ్చిరాగానే బాబుపైనే ధ్వజమెత్తారు.
ప్రస్తుతం.. విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వంటి కార్యకలాపాల్లో బీజీ అయిపోయారు. అయితే.. ఆయన చేపట్టిన ‘పట్టిసీమ’ ప్రాజెక్టుపై మాత్రం విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. విపక్షాలు కామెంట్లు చేయడం సర్వసాధారణమే కానీ.. టీడీపీతో చేతులు కలిపిన బీజేపీ పార్టీ నేత, పైగా ఆయన సమీప బంధువు అయిన పురందేశ్వరి తాజాగా ఆ ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొస్తూ బాబునే ప్రశ్నించడం సంచలనంగా మారింది. పట్టిసీమ ప్రాజెక్టుతో నదుల అనుసంధాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని చెప్పుకుంటున్న బాబు ప్రకటనల్లో నిజముందా? అని ఆమె ప్రశ్నించారు. అసలు ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఏమాత్రం ప్రయోజనం లేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
శుక్రవారం చిత్తూరులో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన పురందేశ్వరి.. కేవలం మూడేళ్లు మాత్రమే అందుబాటులో వుండే పట్టిసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం అనవసరంగా హడావిడి చేస్తోందని ఆరోపించారు. ఈ ‘పట్టిసీమ’ కంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అవగాహన వుండటం కారణంగానే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం రూ.450 కోట్లు విడుదల చేశారని తెలిపారు. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ రెండుశాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని పురందేశ్వరి నిందలు వేశారు. ఈ విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు టీడీపీ వర్గాలు షాక్ కి గురయ్యారు. మరి.. ఈమె వ్యాఖ్యలపై వారి స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more