BJP Leader Daggubati Purandeswari Makes Controversial Comments On Pattiseema Project And Chandrababu Naidu | Ap Capital City Amaravathi

Daggubati purandeswari controversial comments pattiseema project chandrababu naidu

Daggubati Purandeswari News, Daggubati Purandeswari Updates, Daggubati Purandeswari chandrababu, Daggubati Purandeswari pattiseema project, pattiseema project news, pattiseema project updates, chandrababu updates, chandrababu controversies, chandrababu tours, polavaram project, central government

Daggubati Purandeswari Controversial Comments Pattiseema Project Chandrababu Naidu : BJP Leader Daggubati Purandeswari Makes Controversial Comments On Pattiseema Project And Chandrababu Naidu.

చంద్రబాబుకు చురకలంటించిన పురందేశ్వరి

Posted: 09/26/2015 09:58 AM IST
Daggubati purandeswari controversial comments pattiseema project chandrababu naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడకి సమీప బంధువు, బీజేపీ నేత అయిన దగ్గుబాటి పురందేశ్వరి చురకలంటించారు. నిజానికి వీరిద్దరి మధ్య ఎన్నాళ్లనుంచో విభేదాలున్నాయి. గతంలో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే! అయితే.. గడిచిన ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ చేతులు కలపడం, బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందడం, పురందేశ్వరి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అవడం అంతా జరిగిపోయాయి. దీంతో ఆమెకు, బాబుకు మధ్య విభేదాలు సమసిపోయాయని, బంధువులు తిరిగి ఒక్కటయ్యారని అనుకున్నారు. కానీ.. ఇప్పటికీ వారిమధ్య వైరుధ్యాలు వున్నాయని తాజాగా పురందేశ్వరి వ్యాఖ్యలు తెలుపుతున్నాయి. బీజేపీలోకి ఎంట్రీ అయిన తర్వాత ఇన్నాళ్లూ సైలెంట్ గా వున్న ఆమె.. ఇప్పుడు మైకు ముందుకు వచ్చిరాగానే బాబుపైనే ధ్వజమెత్తారు.

ప్రస్తుతం.. విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో బాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వంటి కార్యకలాపాల్లో బీజీ అయిపోయారు. అయితే.. ఆయన చేపట్టిన ‘పట్టిసీమ’ ప్రాజెక్టుపై  మాత్రం విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. విపక్షాలు కామెంట్లు చేయడం సర్వసాధారణమే కానీ.. టీడీపీతో చేతులు కలిపిన బీజేపీ పార్టీ నేత, పైగా ఆయన సమీప బంధువు అయిన పురందేశ్వరి తాజాగా ఆ ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొస్తూ బాబునే ప్రశ్నించడం సంచలనంగా మారింది. పట్టిసీమ ప్రాజెక్టుతో నదుల అనుసంధాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని చెప్పుకుంటున్న బాబు ప్రకటనల్లో నిజముందా? అని ఆమె ప్రశ్నించారు. అసలు ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ఏమాత్రం ప్రయోజనం లేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

శుక్రవారం చిత్తూరులో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన పురందేశ్వరి.. కేవలం మూడేళ్లు మాత్రమే అందుబాటులో వుండే పట్టిసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం అనవసరంగా హడావిడి చేస్తోందని ఆరోపించారు. ఈ ‘పట్టిసీమ’ కంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అవగాహన వుండటం కారణంగానే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం రూ.450 కోట్లు విడుదల చేశారని తెలిపారు. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ రెండుశాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని పురందేశ్వరి నిందలు వేశారు. ఈ విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు టీడీపీ వర్గాలు షాక్ కి గురయ్యారు. మరి.. ఈమె వ్యాఖ్యలపై వారి స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Purandeswari  Chandrababu Naidu  Pattiseema Project  Polavaram Project  

Other Articles