నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద విడుదలైన తాజా 64 ఫైళ్ల మీద నేతాజీ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై ప్రభుత్వం నిఘా వేసిందని 70 ఏండ్లుగా మేం అనుమానిస్తున్న విషయం నిజమేనని ఈ పత్రాలద్వారా తేలిందని బోస్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిఘా ఫైళ్లను నేను ఇప్పుడు చూడగలుగుతున్నాము.. చంద్రబోస్ కొడుకు అమియనాథ్ బోస్తోపాటు శిశిర్బోస్, అరబిందో బోస్లపై నాటి ప్రభుత్వాలు నిఘా పెట్టాయని బోస్ ముని మనవడు అన్నారు. బోస్ కుటుంబీకులు, ఆయన అనుచరులపై నిఘా వేయాల్సిన అవసరమేంటి? అని అతను ప్రశ్నించారు. మా తండ్రి అమియనాథ్ బోస్.. దావూద్ ఇబ్రహీం కాదు! అయినా ఇంటెలిజెన్స్ విభాగంనుంచి 14 మందిని ఆయనపైనా, మా కుటుంబంపైనా నిఘాకు నియమించారు. భారత విప్లవకారుడి కుటుంబంపై భారత ప్రభుత్వం ఎందుకు నిఘా వేసింది? దీనిపై ప్రధాని మోదీ విచారణకు ఆదేశించాలి అని చంద్రబోస్ డిమాండ్ చేశారు.
1972లో సిద్ధార్థ శంకర్ రే బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక కీలకమైన ఫైలు కాల్చివేసినట్లు ఈ ఫైళ్లు బయటకు రావడానికి కొద్ది గంటల ముందు బోస్ కుటుంబానికి ఒక సమాచారం పొక్కింది. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన కీలక సమాచారం అందులో ఉందని చంద్రబోస్ తెలిపారు. ఫైళ్లను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేసిన చంద్రబోస్.. ఇది సరైన అడుగని పేర్కొన్నారు. నేతాజీ ఫైళ్లను సుదీర్ఘకాలం దాచి ఉంచడంద్వారా కొందరు నేతలు దేశం పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని చంద్రబోస్ ఆరోపించారు. నేతాజీ ఫైళ్లను విడుదల చేయడం ద్వారా సీఎం సాహసోపేత చర్య తీసుకున్నారని బోస్ మేనకోడలు, టీఎంసీ ఎంపీ కృష్ణబోస్ అన్నారు. కేంద్రం కూడా తన వద్ద ఉన్న ఫైళ్లు ప్రజల ముందుకు తేవాలని ఆమె కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more