హైదరాబాద్లో గణేశ్ నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తామని.. భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ నెల 17న జరిగే వినాయక విగ్రహ ప్రతిష్టతో ప్రారంభమయ్యే ఉత్సవాలు... సెప్టెంబర్ 28న జరిగే నిమజ్జనంతో ముగుస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలకు రంజాన్, బోనాల మాదిరిగానే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో చెరువులు కలుషితం అవుతున్నాయనే విషప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ పిలుపిచ్చింది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ చైతన్య సభ ఘనంగా నిర్వహించారు.
గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు సర్కార్ పెడుతున్న కిరికిరిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తప్పుపట్టింది. వినాయక మండపాల ఏర్పాట్లపై పోలీసుల అభ్యంతరాలు ఏమిటని సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన మతపరమైన స్వేచ్చను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, ఇతర మతాల వేడుకలకు అడగకుండానే సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్.. గణేష్ ఉత్సవాలపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని మండిపడ్డారు. పాశ్చాత్య సంస్కృతికి దూరంగా పండుగను జరుపుకోవాలని, హిందూ మత ఆవశ్యకతను చిన్నజీయర్ స్వామి వివరించారు. సౌదీ ప్రభుత్వం హిందూమతాన్ని గౌరవించి ఆలయాలకు స్థలాలను కేటాయించిందని స్వామి కమళానంద భారతి గుర్తు చేశారు. హిందు మతం గొప్పతనం ప్రపంచానికి తెలిసివచ్చిందని, కానీ కొన్ని మతాల వారు హిందుత్వాన్ని కించపరుస్తున్నారని కమళానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించేవారు కేవలం హిందువులు మాత్రమేనని మాతా హేమలత శాస్త్రి అన్నారు. హిందూమతంలో ఆ గొప్పతనం ఉందని చెప్పారు. ఇతర మతాలవారికి సహాయం చేయడాన్ని తప్పు పట్టటం లేదని, హిందుత్వం పట్ల వివక్ష చూపితే సహించేది లేదన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. హుసేన్ సాగర్ ను ఖాళీ చేయటం ఎవరి వల్ల కాదన్నారు. వినాయక సాగర్ లోనే నిమజ్జనాలు ఉంటాయని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more