సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ మిస్టరీ వీడనుందా... బోస్ చనిపోయారా..లేక అదృశ్యమయ్యారా..ఎందుకు ఇన్నాళ్లుగా ఈ అనుమానం వేధిస్తూనే ఉంది..ఈ అనుమానాలకు చెక్ పెట్టేందుకు బెంగాల్ సర్కార్ ముందుకొచ్చింది. నేతాజీకి సంబంధించిన 64 ఫైల్స్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ తరుణంలో కేంద్రం కూడా తన వద్ద ఉన్నకీలక పత్రాలు బయటపెటితే నేతాజీ అదృశ్యంపై త్వరలో మిస్టరీ వీడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. భారతదేశ చరిత్రలో నేతాజీ మరణం అంతుచిక్కని రహస్యం. ఈ అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని అంతా భావించారు. అప్పటి ప్రభుత్వాలు కూడా బోస్ మృతిని ధృవీకరించాయి. ఐతే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని విశ్వసించడం లేదు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేసిన నేతగా బోస్ చరిత్రలో నిలిచిపోయారు. ఐతే బోస్ మరణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా సుభాష్ చంద్రబోస్కు సంబంధించి తమ వద్ద ఉన్న 64 దస్ర్తాల సమాచారాన్ని బహిర్గత పరచనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ప్రజల కోరిక మేరకు వచ్చే శుక్రవారం నేతాజీ జీవిత వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామనీ, డాక్యుమెంట్లను కోల్కతా పోలీస్ మ్యూజియంలో భద్రపరుస్తామని దీదీ చెప్పారు.
మమతా బెనర్జీ నిర్ణయాన్ని నేతాజీ బంధువులు స్వాగతించారు. దీదీ నిర్ణయంతో బోస్ మరణంపై ఉన్న ఊహాగానాలకు తెరపడటంతో పాటు ఆయన జీవితం గురించి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం కలిగిందన్నారు. నిజాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరనీ, గత పాలకుల సంకుచిత బుద్ధితో బోస్ చరిత్రను మరుగున పరిచారని ఆరోపించారు. నేతాజీ దస్ర్తాల వెల్లడితో విదేశీ సంబంధాలు ప్రభావితం అవుతాయని కేంద్రం ఇన్నాళ్లూ పేర్కొంటూ వస్తోంది. నేతాజీకి సంబంధించి బెంగాల్ ప్రభుత్వం వద్ద 64 దస్ర్తాలు, కేంద్ర ప్రభుత్వం వద్ద 100 దస్ర్తాలు ఉన్నట్లు సమాచారం. సుభాష్ చంద్రబోస్ మరణంపై రహస్యాలను బహిర్గత పరచాలంటూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు నేతాజీ మరణంపై పరిశోధన చేస్తున్న పలువురు పరిశోధకులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం కూడా నేతాజీకి సంబంధించిన అన్ని దస్త్రాలను బయట పెట్టాలని నేతాజీ బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more