బంద్ అంటే ఏదో ఫార్మాలిటీ కాదు.. ఎంతో మందిని ప్రభావితం చేసే అంశ:. అవసరమైతే కానీ బంద్ అనే మాటను వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడు అనుకుంటే అప్పుడు... ఏ అవసరం వచ్చినా బంద్ బందూక్ పేలుస్తున్నారు. సామాన్యుల జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నేడు ఏపిలో వైసీపీ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న బంద్ నాలుగు ధర్నాలు.. ఎనిమిది అరెస్టులుగా సాగుతోంది. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కాకినాడ లాంటి చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకులు డిపోల ముందు ఉదయాన్నే ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ బస్సులను బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. కాగా జగన్ బంద్ పిలుపునిచ్చిన సమయంలో ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బస్సుల అద్దాలు పగలగొట్టైనా సరే బంద్ ను విజయవంతం చేస్తాం అని వ్యాఖ్యానించడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.
ఏపిలో బంద్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. వైసీపీ నేతలు తమ సామర్థాన్ని నిరూపించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నాయకులు తమ అధినేత ముందు ఎలాగైనా మంచి మార్కులు కొట్టేయాలని వీలైనంత వరకు బంద్ ను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇక కొంత మంది ఎమ్మెల్యేలు అయితే ఉదయం ఐదు గంటల నుంచే బంద్ మీద ఆరాలు తీస్తున్నారు. రోడ్ల మీద బైఠాయించి ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇక జగన్ కు ఈ బంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. బంద్ సక్సెస్ అయితే ఏపిలో తన మాట గెలిచినట్లే అని జగన్ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకు ధీటుగా సమాధానం చెప్పే వారిగా జగన్ నిలవాలని ఆరాటపడుతున్నారు. అందుకే బంద్ పేరుతో బలవంతంగా ప్రజాజీవితాలను ప్రభావితం చేస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more