2012లో హత్యకు గురైన షీనా బోరా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సస్పెన్స్ సినిమాల్లోలాగా మూడేళ్లనుంచి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగిన ఈ హత్య కేసులో ఊహించని పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. అందులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రధానమైన విషయం ఏమిటంటే.. షీనాని చంపింది మరెవ్వరో కాదు, ఆమె తల్లి ఇంద్రణి ముఖర్జీయే. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఇంద్రాణి తన కూతురు షీనాని తన సోదరిగా ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ, షీనా హత్య కేసు విచారణలో మాత్రం ఆమె తల్లి అని బట్టబయలైంది. అందరికీ ఝలకిచ్చిన ఈ వార్త నుంచి ఇంకా తేరుకుంటుండగానే.. అసలు కన్నతల్లే తన కూతుర్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే రకరకాల వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓవైపు ఆస్తి వివాదంలో తన కూతురినే ఇంద్రాణి చంపి వుంటుందని అనుమానాలు రేకెత్తుతుండగా.. మరోవైపు ఇంద్రాణి భర్త మొదటి భార్య కొడుకుతో షీనా ఎఫైర్ నడుస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆమె చంపేసినట్లుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇంకా రకరకాల అనుమానాల నడుమ ఎటూ తేలకుండా ఈ కేసు కొనసాగుతుండగానే.. తాజాగా ఈ కేసులో తన తల్లి ఇంద్రాణి ముఖర్జీ పాత్ర గురించి మరిన్ని విషయాలు బయటపెడతానంటూ కొడుకు మిఖైల్ బోరా తెరమీదకొచ్చాడు. తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తనకు తెలుసునని అంటున్నాడు. తాను చేసిన నేరాన్ని తన తల్లి పోలీసుల ముందు పోలీసుల ముందు ఒప్పకోకపోతే మాత్రం తాను సాక్షిగా మారతానని తెలిపాడు.
ఈ సందర్భంలోనే మిఖైల్ మాట్లాడుతూ.. ‘నా సోదరిని తల్లే హత్య చేసిందని నేను నమ్ముతున్నా. అందుకు సంబంధించి పూర్తి కారణాలు నాకు తెలుసు. ఈ కేసు వెనుక కేవలం ఒక కారణం మాత్రమే లేదు.. చాలానే ఉన్నాయి. ఆమె నేరాన్ని అంగీకరించని పక్షంలో.. నేను ఏది చేయాల్సిన అవసరం వస్తుందో అది కచ్చితంగా చేస్తా. ఆగస్టు 31 వరకూ ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం ఆ హత్య గల కారణాలను వెల్లడిస్తా’ అతగాడు స్పష్టం చేశాడు. దీంతో ఈ కేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇంతకీ ఆ కారణాలు ఏమై వుంటాయా..? అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అటు పోలీసుల విచారణలో ఇంద్రాణి ఏం చెబుతుందోనని ఆసక్తి నెలకొంది.
ఇదిలావుండగా.. ఈ హత్య కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ వున్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే వారికి జరిగిన వివాహాలకు విడాకులూ అయ్యాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో తనకు జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచింది. అనంతరం చోటు చేసుకున్నపరిణామాలు కూతురు షీనా బోరా హత్యకు దారి తీశాయి. ఆ విషయాన్ని దాచి పెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్లినట్లు నమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more