1993 ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడే కాక దేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులకు కుట్రలు పన్నిన దావూద్ ఇబ్రహీం.. పాకిస్థాన్లో నక్కి వున్న విషయం తెలిసిందే! అయితే.. అతని కచ్చితమైన చిరునామా కోసం భారత నిఘా వర్గాలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అతగాడి అడ్రస్ నిఘా వర్గాలకు తెలిసిపోయింది. తన భార్య మెహజబీన్ షేక్, కొడుకు మొయీన్ నవాజ్, కూతుళ్లు మహరుక్, మెహ్రీన్, మాజియా అందరితో కలిసి దావూద్ పాకిస్థాన్లోని కరాచీ నగరంలోనే ఉంటున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకు పక్కా ఆధారాలు కూడా లభ్యమయినట్లు సమాచారం. వాటితో పాటు.. దావూద్ తాజా ఫొటోను కూడా భారత నిఘావర్గాలు సంపాదించాయి.
ప్రస్తుతం దావూద్ కరాచీ నగరం శివార్లలోని క్లిఫ్టన్ అనే ప్రాంతంలో వుంటున్నాడు. 2015 ఏప్రిల్ నెలలో దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లులను కూడా భారత నిఘా వర్గాలు సంపాదించాయి. అందులో దావూద్ చిరునామా ఇలా ఉంది.. ‘'డి-13, బ్లాక్-4, కరాచీ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్సిహెచ్-5, క్లిఫ్టన్’. దావూద్ ఇబ్రహీంకు మూడు పాకిస్థానీ పాస్పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా దావూద్ కు ఒక్క చిరునామాయే కాకుండా.. మరో రెండు వున్నట్లు అర్థమవుతోంది. వాటిలో ఒకటి.. ‘'6ఎ, ఖయబాన్ తంజీమ్, ఫేజ్ 5, డిఫెన్స్ హౌసింగ్ ఏరియా’ కాగా.. మరొకటి ‘మొయిన్ ప్యాలెస్, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా వద్ద, క్లిఫ్టన్, కరాచీ’. మరోవైపు.. దావూద్ కొడుకు మొయీన్కు సానియా అనే అమ్మాయితో పెళ్లయింది. అలాగే ముగ్గురు కూతుళ్లలో ఒకరైన మహరూఖ్కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కొడుకు జునాయిద్తో పెళ్లయింది.
ఇదిలావుండగా.. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే వున్నాడని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ వారు మాత్రం అతగాడు తమ దేశంలో లేడని ఖండిస్తూ వచ్చారు. మరి.. ఇప్పుడు లభించిన తాజా ఆధారాలతో పాక్ దేశం ఏమీ మాట్లాడలేక బిత్తరపోయినట్లు తెలుస్తోంది. లేడని 1993లో ముంబై మహానగరంలో వరుస పేలుళ్లకు ప్రధాన కుట్రదారు అయిన దావూద్ ఇబ్రహీం పేరు మీద ఇంటర్పోల్ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. ఆ పేలుళ్లలో 257 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more