గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు తీవ్ర కలకలం రేపినప్పటి నుంచి కాలేజీల్లో విద్యార్థినుల బలవన్మరణాలు మరింత పెరుగుతున్నాయి. ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి కేసు ఇంకా కొనసాగుతుండగానే ఇటీవలే కడప జిల్లాలోని నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిద్దరి ఆత్మహత్యల వెనుక అసలు కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలోనే తాజాగా మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గూడూరులోని డీఆర్ డబ్ల్యూ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగింది.
కళాశాల హాస్టల్ గదిలో ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని రవళి ఉరేసుకుని మరణించింది. రవళి ఉరేసుకుని ఉండటాన్ని చూసిన ఇతర విద్యార్థినులు వెంటనే కళాశాల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. రవళి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఉన్నట్టుండి ఈ అమ్మాయి కాలేజీ హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ఈ అమ్మాయి కూడా ర్యాగింగ్ భూతానికి బలై వుండవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం. లేదా ప్రేమ వ్యవహారం, కుటుంబ కలహాల కారణంగా సూసైడ్ చేసుకుందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కాలేజీల్లో విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటుండటంతో విచారణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more