ఏదైనా పార్టీలో కొనసాగే రాజకీయ నాయకులకు అంతగా గుర్తింపు లభించకపోతే ఏం చేస్తారు..? అధికారంలో వున్న పార్టీలో లేక ప్రాభవం వున్న పార్టీలోకి జంప్ అవుతారు. ఒకవేళ సదరు నేతకు మంచి అనుభవం వుండి, నలుగురిలో గుర్తింపు వుంటే స్వయంగా పార్టీ పెట్టేసుకుంటారు. జనాల్లో మమేకమయ్యేందుకు రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తారు. ఇప్పుడు నాగం జనార్ధన్ రెడ్డి వ్యవహారశైలి గమనిస్తుంటే.. ఇలాగే అనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రేకాక టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన నాగం జనార్ధన్ రెడ్డి ప్రాభవం రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. తిరిగి తన ఇమేజ్ ని పొందేందుకు సరికొత్త ప్రణాళికలను అవలంభిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ పార్టీలో కొనసాగుతూ నాగం జనార్ధన్ రెడ్డికి ఓ రేంజులో వుండేవారు. కానీ.. విభజన తర్వాత ఈయన ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఆయన.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, కొంత కాలంపాటు సైలెంట్ గానే ఉన్నారు. అలాగే ఉండిపోతే తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుందన్న అభిప్రాయంతో ఆయన కొన్నాళ్ల తర్వాత బీజేపీలోకి చేరిపోయారు. ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందెందుకు కష్టపడినప్పటికీ.. ఆయన పొసగలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన కాస్త తెలివిగా ఆలోచించి ఓ అడుగు ముందుకెశారు. బీజేపీలో కొనసాగుతూనే సాగు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ‘బచావో తెలంగాణ’ పేరిట తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అయితే ఈ యాత్రలే ఆయనను బీజేపీకి దూరం చేసినట్లు తెలుస్తోంది.
కేవలం నాగం జనార్ధన్ మాత్రమే కాదు.. ఆయనతోపాటు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని కూడా ఆ యాత్రలే పార్టీకి దూరం చేశాయనే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ పార్టీలో అంతగా గుర్తింపు లేదు. వీరిద్దరినీ పట్టించుకునే నాధుడే లేడు. దీంతో భగ్గుమన్న ఈ ఇద్దరు నేతలు ‘బచావో తెలంగాణ’ కార్యక్రమాన్నే ప్రజా వేదికగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీకి కటీఫ్ చేస్తున్నట్లు బహిరంగంగా వారిరువురు ప్రకటించకపోయినా.. ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే.. నాగం, యెన్నం ఇద్దరూ బీజేపీకి దూరమైనట్టేనన్న అనుమానాలు స్పష్టమవుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more