పులిరాజా అంటే అందరికి తెలుసు. ఓ వ్యాధి మీద జనాలను చైతన్యం చెయ్యడానికి చేసిన విస్రృత ప్రచారంలో పులిరాజా పేరు బాగా పాపులర్ అయింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..? అంటూ ప్రభుత్వం చేసిన ప్రచారం ఢిల్లీ నుండి గల్లీకి చేరింది. అప్పటిదాకా తెలియని ఎయిడ్స్ గురించి అందరికి తెలిసిపోయింది. దాంతో ప్రజలు ఎయిడ్స్ మీద అవగాహన పెంచుకున్నారు. ఫలితంగా మరికొంత మంది ఆ మహమ్మారి బారిన పడకుండా తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పులిరాజా ప్రస్తావన తీసుకువచ్చాం. ఏపిలో ప్రస్తుత పరిస్థితుల ఫలితంగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పులిరాజాగా మారతారా..? అనే ప్రశ్న వస్తోంది. అసలు పులిరాజా యాడ్ వేరే ఉద్దేశంతో కదా ప్రారంభించారు.. మరి మీరేంటి చంద్రబాబు నాయుడు పులిరాజా అవుతాడా...? అంటూ ప్రశ్నిస్తున్నారు అని అనుకుంటున్నారా.? దానికి సమాధానం ఉంది. కానీ అక్కడి పులిరాజాకు, మేము చెబుతున్న పులిరాజాకు తేడా ఉంది.
ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి గతంలో ప్రభుత్వం పులిరాజా అనే క్యారెక్టర్ ను తెర మీదకు తీసుకువస్తోంది. అయితే ప్రస్తుతం ఏపిలో ఓ ఉద్యమం నడుస్తోంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అక్కడి ప్రజలు, నాయకులు, అందరూ కలిసి ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే దగా పడ్డ ఏపికి కనీసం ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా అయినా సరే న్యాయం చెయ్యాలని.. తాము అభివృద్ది చెందడానికి సహకరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అసలు వైఖరి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకసారి అవునంటారు.. మరోసారి కాదంటారు. మొత్తానికి ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడును పులిరాజాను చేస్తోంది. అవును కేంద్రం అవలంభిస్తున్న అస్పష్టవైఖరి నారా చంద్రబాబు నాయుడును పులిరాజాను చేస్తోంది.
చంద్రాబాబు నాయుడు పులిరాజా ఎలా అవుతారు .? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదా..? ముందు గతంలో వచ్చిన పులిరాజా యాడ్ గురించి తెలుసుకుందా. ఎయిడ్స్ అనే వ్యాధి ఎంతో భయంకరమైంది.. దాని మీద అవగాహన కల్పించాలంటే ప్రజలకు చేరువయ్యేలా ఓ క్యారెక్టర్ ను తీసుకురావాలని పులిరాజా అనే క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. మీలో ఎవరు పులిరాజా అనగానే జనాలు పులిరాజా ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టారు. అలా ప్రస్తుతం కూడా ఏపికి అన్యాయం జరగకుండా ప్రత్యేక హోదీ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే దానికి సరైన బ్రాండ్ అంబాసిడర్ కావాలి. అందుకే ప్రతిపక్షాలు అన్నీ కలిసి చంద్రబాబు నాయుడును తమ బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకుంటున్నాయి. చంద్రబాబు అంటే ఇలా ఉన్నారు... అందుకే ఏపికి ప్రత్యేక హోదా రావడం లేదు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటం లేదు.. పళ్లెత్తి మాట్లాడటం లేదు అని అన్ని పక్షాలు కలిసి ప్రచారం చేస్తున్నాయి. మొత్తానికి ప్రత్యేక హోదా రాకుండా బాబు గారు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తే ప్రతిపక్షాల లక్ష్యం నెరవేరుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more