ఆంధ్రప్రదేశ్ ఖజానా నింపడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాదిన్నరలో ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడంతో ఆదాయ మార్గాలపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ పూడ్చేందుకు చంద్రబాబె నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలే రాజధాని లేదు.. దానికి తోడు ఓ వైపు లోటు బడ్జెట్.. విభజన తరువాత ఏపీ పరిస్థితి ఇది. ఆ కష్టాలు ఇంకాస్త పెరిగాయి ఇప్పుడు.. విభజన కారణంగా ఆర్థిక లోటుతోనే కొత్తగా ఆవిర్భవించిన ఏపీకి.. బండి నడవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వేలు, పదివేలు కాదు.. ఏకంగా 90వేల కోట్ల రూపాయల వరకూ ప్రస్తుతం రాష్ట్రం రుణభారాన్ని మోయాల్సి వస్తోందని అంచనా.
సమైక్యంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి లక్షా 15వేల కోట్ల రూపాయల అప్పుండేది. ఆర్థికంగా ఆస్తులేమీ లేకపోయినా జనాభా ప్రాతిపదికన విభజన జరగడంతో.. ఏపీకి 64వేల 441కోట్ల అప్పు మాత్రం వచ్చింది. తొలి ఏడాది రాష్ట్రం నడవడం కోసం 11వేల కోట్ల రూపాయలను ఓపెన్ మార్కెట్ నుంచి మళ్లీ రుణం తీసుకుంది సర్కార్. ఇక ఉద్యోగుల వేతన సవరణ, రుణమాఫీ, ఫించన్లు, ఇతర పథకాల అమలు మరింత భారంగా మారడంతో పాటు.. పాత అప్పులకే గతేడాది 16 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఖర్చు పెరుగుతూ వస్తోంది..
పెరిగిపోతున్న ఆర్థిక లోటును దిద్దుబాటు చేసేందుకు నడుం బిగించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచి రెండేళ్లలో మిగులు బడ్జెట్ వైపు దూసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులతో సీఎం బాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని ఆ శాఖ అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఎర్రచందనం, ఇసుకపై ఆదాయం పెరిగిందని, అదే సమయంలో వ్యయం కూడా పెరిగిందని రెవెన్యూ అధికారులు సీఎంకు తెలిపారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్, పెన్షన్ల పెంపు, రుణమాఫీ తదితర పథకాల కారణంగా ఆయా వర్గాలకు రాయితీలు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులతో చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర నుంచి రావాల్సిన రాయితీలపై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్తో ఆయన ఫోన్ లో మాట్లాడారు ఏపీ సీఎం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more