వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటే... అయినా అనుకుంటే మాత్రం పొరపాటే అని పెద్దలు అంటూ ఉంటారు. అప్పడప్పుడు మనం చేస్తున్న తప్పుల గురించి సరిగ్గా తెలియక అలా అనుకుంటు ఉంటాం. అయితే తెలంగాణ బిజెపి నాయకులు మీద బజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీనిపై స్పందించారు. బిజెపి పార్టీ బలోపేతం చెయ్యండి, సభ్యత్వాన్ని భారీ నమోదు చెయ్యండి అంటే అంతా సూపర్ అంటూ ఊదరగొడుతున్నారు తెలంగాణ బిజెపి నాయకులు అందుకే అమిత్ షా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. హైదరాబాద్ లో కూర్చుని అంతా చక్కగా ఉంది ఏం పర్వాలేదు అనుకుంటున్న తెలంగాణ బిజెపి నాయకులకు బాగానే క్లాస్ తీసుకున్నారు అమిత్ షా. మోదీ నాయకత్వంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టిసారించిన బిజెపి పార్టీ నాయకత్వం తెలంగాణ నేతల తీరు మీద మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారట.
తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే అదే సమయంలో దేశవ్యాప్తంగా మోదీ మానియా వీచిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పట్టు లభించింది బిజెపికి. అయితే సీమాంధ్రలో కన్నా కూడా తెలంగాణలో ముందు నుండి పార్టీకి కాస్త పట్టెక్కువ.. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిజెపి పార్టీ మరింత బలపడుతుందని బిజెపి అధినాయకత్వం గట్టిగా నమ్మింది. కానీ ఆశించిన స్థాయిలో బిజెపి పార్టీ క్రియాశీలంగా లేదని అధినాయకత్వం మండిపడుతోంది. అంతకు ముందు కూడా తెలంగాణలో బిజెపి పార్టీకి ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునేంత సొంత బలం ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో కనీసం ఒకటి రెండు అప్పుడప్పుడు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునే అవకాశాలు బిజెపి పార్టీకి పుష్కలంగా ఉన్నాయి.
బిజెపి పార్టీకి తెలంగాణలో ఎంతో కొంత సాఫ్ట్ కర్నర్ ఉంది. అయితే ఆ యాంగిల్ ను బిజెపి పార్టీ వినియోగించుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. సభ్యత్వ నమోదులోనే కాకుండా పార్టీని కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో పార్టీ తెలంగాణ నాయకత్వం విఫలమవుతోందని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ నాయకుల మీద తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లో కూర్చొని అంతా సరిగ్గా ఉంది అనుకుంటే సరిపోదని అన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇలానే ఉంటే 2019 నాటికి అధికారంలోకి ఎలా వస్తుందని కూడా అమిత్ షా ప్రశ్నించారు. అయితే తాజాగా కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని ప్రకటించారు. అయితే కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించినా కానీ నిజానికి అధినాయకత్వం కిషన్ రెడ్డి పనితీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి తెలంగాణలో అమిత్ షా ఎలాంటి రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శిస్తారో చూడాలి.
By Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more