తెలుగుచిత్ర పరిశ్రమ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా గర్వించేలా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి’ చిత్రాన్ని రూపొందించారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్టుతో రెండున్నరేళ్లు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి జూలై 10వ తేదీన భారీయెత్తున విడుదల అవుతోంది. ట్రైలర్ల ద్వారా అద్బుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం విడుదలకోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకజనాలు ఎంతో ఆసక్తిగా వున్నారు. ఇటువంటి ఉత్కంఠ సమయంలో ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ కులానికి చెందిన సంఘం.. ఈ సినిమా విడుదలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి ఎంతో అద్భుతంగా చెక్కిన శిల్పం ‘బాహుబలి’లో మాల కులస్తును అవమానపరిచే సన్నివేశాలు, మాటలు వున్నాయని తెలంగాణ మాలల జేఏసీ మండిపడుతోంది. అందుకే.. ఆయా సన్నివేశాల్ని వెంటనే తొలగించాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. యూట్యూబ్ లో మాలలను కించపరుస్తూ వున్న క్లిప్పింగ్స్ సేకరించి.. వాటిని పోలీసులకు అందించామని, ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశామని ఆ సంఘం ఛైర్మన్ బి.దీపక్ కుమార్ వివరించారు. ఆ దృశ్యాల్ని తొలగించకుంటే సినిమా విడుదలకు అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని, తమకు న్యాయం జరిగేలా సహకరించాలని ఆయన కోరారు.
ఇదిలావుండగా.. జూలై 10వ తేదీన ‘బాహుబలి’ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమా విడుదలకు ముందు మాలల జేఏసీ సరికొత్త వివాదంతో తెరముందుకు రావడంతో కాస్త సందిగ్ధత నెలకొంది. మరి.. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో..? ‘బాహుబలి’ యూనిట్ ఎటువంటి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more