కేఎఫ్సీ చికెన్ సురక్షితం కాదని పరీక్షల్లో వెల్లడైనట్లు తెలిసింది. కేఎఫ్సీ చికెన్పై ఇటీవల ఆరోపణలు రావడంతో ఆహార భద్రతా చట్టం కింద తెలంగాణ ప్రభుత్వం 15 శాంపుళ్లను సేకరించి పరీక్షలు చేయించింది. మరోవైపు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మున్సిపల్ చట్టం కింద 28 శాంపుళ్లను సేకరించి పరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వాటి ఫలితాలు బాగానే వచ్చినా... జీహెచ్ఎంసీ సేకరించిన వాటిలో 8 శాంపుళ్లలోని చికెన్ తినడానికి సురక్షితం కాదని తేలినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా సదరు నమూనాలకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కె ఎఫ్ సీ ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన ఈ కొలి, సాంనెల్లా లాంటి బ్యాకీ్టరియాలున్నాయని బాలల హక్కుల సంఘం ఆరోపించి.. వెంటనే కె ఎఫ్ సీని నిషేదించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆయా సంస్థలపై క్రిమినెల్ కేసులు పెట్టడానికి కూడా తాము వెనుకాబోమని బాలల హక్కుల సంఘం హెచ్చరించింది. అమెరికా లాంటి దేశాల్లో అక్కడి పౌరులు తినడానికి ఇష్టపడని, పదార్థాలను భారత్ లాంటి దేశాలకు తరలించి.. వాటిని ఇక్కడ అమ్మి సోమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన జీహచ్ఎంసీ అధికారలు శాంపుళ్లను సేకరించి పరీక్షలు పంపగా, చికెన్ సురక్షితం కాదని తేలింది.
విదేశాలు కేంద్రంగా భారత్ లోకి వస్తున్న పలు ఫుడ్ ఐటెంస్ లో హానకరమైన పదార్థాలు వున్నా వాటిని భారత్ మార్కెట్ లోకి ఎలా రాణిస్తున్నారన్న విషయమై తాజాగా చర్చనీయాంశంగా మారింది. మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన ఎంఎస్ జీ అధిక మోతాదులో వుందని, దీని ద్వారా వాటిని సేవించిన పిల్లలు, పెద్దలకు కూడా పలు ఆరోగ్యకర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో రంగంలోకి దిగిన భారతీయ ఆరోగ్య శాఖ అధికారులు దాడులు జరపి దేశవ్యాప్తంగా వాటిని నిషేధించారు.
ఆ తరువాత ఇప్పుడు కేఎఫ్సీ చికెన్.లో హానికరమైన పదార్థాలున్నాయని పరీక్షఃల్లో వెల్లడైంది మ్యాగీ నూడుల్స్ అధ్యాయం ముగిసిందన్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలతో విస్తరించిన ఫ్రైడ్ చికెన్ దిగ్గజం కె ఎఫ్ సీ(కెంటకీ ఫ్రైడ్ చికెన్) లోపభూయిష్టమైన నాణ్యతతో ఆహార పదార్థాలను తయారు చేస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ నగరాల్లో సామాన్య మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరినీ అకర్షించి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారాన్ని సాగిస్తున్న కె ఎఫ్ సీ భారత దేశ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతుందని బాలల హక్కుల సంఘం అరోపించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more