తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పర్యటనల కోసం ఓ ప్రత్యేక బస్సు తయారైంది. అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన బస్సు కొన్నిప్రాంతాలలో ఆయన పర్యటనల కోసం వినియోగిస్తారు. ఈ బస్సు తయారీకి మొత్తం రూ. 5 కోట్ల వరకు ఖర్చయింది. చండీగఢ్లో తయారుచేసిన ఈ బస్సును.. హైదరాబాద్ నగరానికి గురువారం తీసుకొచ్చారు. ఈ బస్సులో అత్యాధునిక హంగులు కూడా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. ఇందులో వై-ఫైతో పాటు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఈ వాహనం హైదరాబాద్ నగరానికి రావడంతో.. ముఖ్యమంత్రికి ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇక్కడ కావల్సిన ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. దీన్ని కేసీఆర్ త్వరలోనే వాడనున్నారు. అయితే ఈ బస్సులపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం పర్యటనల కోసమే ఐదు కోట్లు ఖర్చు పెట్టి మరీ బస్సును కొనుగోలు చెయ్యాలని అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కోసం కొత్తగా తయారుచేయించిన బస్సులో కేసీఆర్ పడుకోవడానికి కనీసం బెడ్ కూడా లేదని సిఎంఓ అధికారులు వెల్లడించారు. కేవలం 12 మంది ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూర్చోవడానికి, మిగిలిన అత్యాధునిక ఎక్వీప్ మెంట్ మాత్రమే బస్సులో ఉన్నాయని తెలిపారు. అయినా అంత ఖర్చు చేసి బస్సును కొన్న కేసీఆర్ బెడ్ ఎందుకు పెట్టించుకోలేదు అని అందరికి సందేహం. మరి ఎందుకో కేసీఆర్ కే తెలియాలి.
Related News : కేసీఆర్ కోసం బెంజ్ బస్సు..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more