ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తి, దేశ మొత్తం ఒక ఉప్పనకు కారణమైంది సోషల్ మీడియా. నరేంద్ర మోదీకి బాసటగా ఎన్నికల ప్రచారం చేసిన సోషల్ మీడియా పాత్రను ఎవరూ కాదనలేరు. నరేంద్ర మోదీ చరిష్మాను అమాంతం పెంచేసి.. ఎన్నికల్లో భారీ మెరిటీతో బిజెపి పార్టీకి, నరేంద్ర మోదీకి అధికారాన్ని కట్టబెట్టింది సోషల్ మీడియా. అందుకే సోషల్ మీడియా అంటే మోదీకి ఎంతో ఇష్టం. ఏ విషాయన్నైనా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చెయ్యడం మోదీకి అలవాటు. అయితే అదే టెక్నాలజీవాడుకునే విషయంలో అందరి కన్నా ముందుండే చంద్రబాబునాయుడు మాత్రం సోషల్ మీడియా అస్సలు కలిసిరావడం లేదు. ఓటుకు నోటు వివాదం ప్రారంభం నుండి చంద్రబాబు నాయుడు మీద వస్తున్న కామెంట్లు చూస్తున్న వారెవరైనా పాపం చంద్రబాబు అంటూ జాలిపడుతున్నారు.
సోషల్ మీడియాను ఎంతో సమర్థవంతంగా వాడటంలో మోదీ, చంద్రబాబు నాయుడు ముందుటారు. అయితే మోదీ విషయాన్ని పక్కనబెడితే చంద్రబాబు నాయుడు మీద గత కొంత కాలంగా ఆరోపణల పర్వం సాగుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరికి విస్మయాన్ని, కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే సోషల్ మిడియాలో మల్ చల్ చేస్తున్న వార్తలు అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండటంతో నెటిజన్లు కూడా లైక్ లు కొడుతున్నారు. అయితే ఇలా మోదీకి మాత్రం కలిసి వచ్చిన సోషల్ మీడియా, చంద్రబాబు నాయుడుకు మాత్రం కలిసి రావడం లేదు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సాగుతున్న ప్ర,చారం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్ని, ఏపిలో పార్టీపై ప్రభావాన్ని చూపగలదు. ఈ ప్రచారాన్ని మొదలుపెట్టిన వారి అసల ఉద్దేశం కూడా ఇదే కావచ్చు. మరి దీనిపై కూడా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటారా.? లేదా సోసల్ మీడియాలో ప్రచారాన్ని తిప్పి కొడతారా చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more