కాంగ్రెస్, బిజెపి పార్టీకి అస్సలు పడదు అన్న విషయాన్ని ఏ చిన్ని పిల్లాడిని అడిగినా చెప్తారు. అయితే తాజా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి బంపర్ ఆపర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో ప్రయాస పడుతున్న జీఎస్టీ(గూడ్స్ సర్వీస్ ట్యాక్స్) బిల్లును ఆమోదించుకునేందుకు మంచి ఐడియా ఇస్తోంది. గత కొంత కాలంగా లలిత్ మోదీ వ్యవహారంలో పీకల్లోతు ఆరోపణలు ఎదుర్కొంటున్న వసుంధర రాజే, సుష్మా స్వరాజ్ లపై బిజెపి పార్టీ వేటు వేస్తే జిఎస్టి బిల్లుకు మద్దతు పలుకుతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. లలిత్ మోదీ వ్యవహారంలో వసుంధర రాజే, సుష్మాస్వరాజ్ లపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గురి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లులపై గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పేచే పెడుతోంది.
ఐపియల్ క్రికెట్ను ప్రారంభించిన లలిత్ మోదీ తాజాగా వివాదల సుడిగుండంలో చిక్కుకున్నారు. అయితే సుష్మాస్వరాజ్ లలిత్ మోదీకి బాసటగా నిలుస్తూ విదేశాలకు వెళ్లేందుకు వీసా ఇప్పించారని, అలాగే సుష్మా కూతురు కూడా లలిత్ మోదీ న్యాయవాదిగా పని చేస్తుండటంతో సుష్మాస్వరాజ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన గళం వినిపిస్తోంది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మీద కూడా ఇలాంటి ఆరోపణలే ఎదురయ్యాయి. మొత్తానికి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న ఇద్దరు నేతలపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. అయితే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎలాగైనా జిఎస్టీ బిల్లును ఆమోదింపజెయ్యాలని ఎన్డీయే ప్రభుత్వం గట్టి పట్టుమీదుంది.మరి కాంగ్రెస్ తాజాగా ఇస్తున్న ఆఫర్ కు ఓకే చెప్పి ఇద్దరు నేతల మీద వేటు వేస్తుందా లేదా వేటు మాట రాకుండా బిల్లును పాస్ చేయించుకుంటుందా చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more