మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒక యువజంట.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాకు చెందిన దంపతులు రాజేంద్ర జాట్ (38), రచనా జాట్ (32)లు అవమాన భారంతో విషగులిళలు సేవించి ప్రాణాలు విడిచారు. కొందరు పోకిరీలు చేసిన పనితో.. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి తోడు సెల్ ఫోన్ లలో బ్యాంకు, ఇతర ముఖ్యమైన విషయాలకు సంబంధిచిన వ్యక్తిగత వివరాలను నిక్షిప్తపర్చవద్దన్న సూచనలు పాటించకపోవడం కూడా యువ జంటను ఆత్మహత్య దిశగా ప్రోత్సహించాయి. తమ సంభోగ దృశ్యాలను రికార్డు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
మధ్య ప్రదేశ్ లోని నూతనంగా వివాహం చేసుకున్న యువజంట.. రాజేంద్ర జాట్, రచనా జాట్ నెల రోజుల కిందట ప్రయాణంలో తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఫోన్ దొంగలించిన నలుగురు యువకులను ఈ నెల 18న పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారిని కోర్టులోనూ హజరుపర్చి జైలుకు తరలించారు. అయితే వారు అరెస్టు అయిన తరువాత అసలు విషయం యువ జంటకు ఆలస్యంగా తెలిసింది. దీంతో వారు విషపధార్థాలను సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఫోన్ దొంగలించిన నలుగరుగు యువకులు అందులోని మొమరీ కార్డులో వున్న వీడియో క్లిప్పింగ్ను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడాన్ని గమనించిన బంధుమిత్రులు వారికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వారు చాలా అవమానంగా ఫీలయ్యారు. సమాజంలో తమ పరువు పోయిందని భావించి, ఇక బతకడం అనవసరమని భావింిచన వారు విష గుళికలను సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసుల నుంచి అందుకున్న కుటుంబ సభ్యులకు వారికి దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో దేవాస్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more