డామిడ్ కథ అడ్డం తిరిగింది.. అన్న నానుడి మనం తరుచూ వింటూనే వుంటాం. అయితే కొందరు పెద్దలు మాత్రం తానోకటి తలిస్తే.. దైవం ఒకటి తలచిందని వేదాంత దోరణిలో చెబుతుంటారు. ఏది ఏమైనా.. విశాఖపట్నం జిల్లాలోని బుచ్చయ్యపేట మండలానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాత్రం నిజంగానే విధి వంచన అంటే ఏమిటో అర్థమైయ్యింది. కొందరు రిపోర్టర్లు స్మగర్ల కోసం మాటు వేస్తే.. పోలీసులు వచ్చారు. దీంతో వారు అడ్డంగా బుక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నడుస్తున్న గంజాయి స్మగర్లు.. లక్షాలాధి రూపాయలను ఆర్జిస్తున్నారని సమాచారం అందుకున్న విలేకరులు.. వారి బెదిరించి.. నయానో, భయానో వారి నుంచి డబ్బు రాబట్టాలని పథకం వేశారు. పథకంలో భాగంగా బుచ్చయ్యపేటలోని వడ్డాది వద్ద మాటు వేశారు.
ఇంతలో ఒడిశా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్న ఒక కారు అటుగా వచ్చింది. అది గంజాయి అక్రమ రవాణా వాహనమేనని భావించిన విలేకరులు.. కర్రలతో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆ వాహనాన్ని నిలిపివేశారు. కారును తనిఖీ చేయాలని లోపలున్నవారిని గద్దించారు. అక్కడే వారి కథ అడ్డం తిరిగింది. వారు అనుకున్నట్టు లోపల ఉంది గంజాయి స్మగ్లర్లు కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్పెషల్ పార్టీ పోలీసులు. సీఐ కె.సూర్యనారాయణ కూడా కారులోనే ఉన్నారు. విలేకరుల హడావుడిని గమనించిన ఆయన.. తనిఖీ చేయడానికి మీరెవరంటూ వారిని ‘గట్టిగా’ నిలదీశారు.
గంజాయి రవాణా చేస్తున్న వాహనం వస్తోందని సమాచారం రావడంతో కాపు కాశామని విలేకరులు ఆయనకు చెప్పారు. వాహనాన్ని అడ్డుకునేందుకు కర్రలు దేనికంటూ... ఆయన ప్రశ్నించారు. అయితే అయన కారు దిగి ఇద్దరు విలేకరులనూ పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలో అక్కడే వున్న మరికోందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఘటనా స్థలం నుంచి పరారై.. తప్పించుకున్నారని సమాచారం. రెడ్ హ్యాండెడ్ గా దోరికిన ఇద్దరు విలేకరులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై సీఆర్పీసీ 170, 353, 341, 342, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more