తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు వ్యవహారం కీలక మలుపుతు తిరుగుతోంది. ఓటుకు నోటు వ్యవహారం కాస్త తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ వివాదంగా మారింది. ట్యాపింగ్ నుండి సెక్షన్ 8 అమలు దిశగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ లోని సీమాంధ్రులకు రక్షణ కరువైందని అందుకే విభజన చట్టంలోని సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం వత్తిడి చేస్తోంది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు ఈమేరకు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విభజన చట్టంలోని సెక్షన్ 8ను అమలు చెయ్యాలన్న ఏపి ప్రభుత్వం వాదనపై తెలంగాణ సర్కార్ కూడా ఘాటుగా స్పందిస్తోంది. అయితే కేంద్రం చేస్తున్న సూచనలపై గవర్నర్ నరసింహన్ సెక్షన్ 8 మీద ముందుకు సాగేందుకు సాహసించడం లేదు. ఎందుకంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్షన్ 8 పై గుర్రుగా ఉన్నారని ఒకవేళ ఆ సెక్షన్ అమలుకు ముందుకు వస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా హెచ్చరించినట్లు గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా సెక్షన్ 8ను అమలు చెయ్యాలని చూస్తే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని, అందుకే ముందుకు సాగలేకపోతున్నానని నరసింహన్ వివరించినట్లు తెలస్తోంది. అయితే హోంమంత్రి రాజ్ నాథ్ మాత్రం రాష్ట్రాలు, అధికారులు ఇచ్చే హెచ్చరికలకు భయపడనక్కర్లేదని నరసింహన్ తో అన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని కూడా రాజ్ నాథ్ సూచించారని సమాచారం. మరి ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత నరసింహన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more